Webdunia - Bharat's app for daily news and videos

Install App

కట్నం కోరిన వరుడు.. 75 పైసలు జరిమానా విధించిన పంచాయతీ...!

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2015 (15:27 IST)
ఆధునిక యుగంలో కోర్టులు, న్యాయవ్యవస్థ ఎంత బలిష్టమైనప్పటికీ కొన్ని ప్రాంతాలలో పంచాయతీ తీర్పే శాసనంగా మారుతుంటుంది. అటువంటి పంచాయతీ పెద్దలు తమకు అనుకూలమైన రీతిలో తీర్పును ఇస్తుంటారు. తాజాగా హర్యానా రాష్ట్రంలోని పంచాయతీ పెద్దలు కట్నం కోరిన వరుడికి 75 పైసలు జరిమానా విధించారు. 
 
హర్యానాలోని, ఫతేహాబాద్‌లో చోటు చేసుకుని ఆ సంఘటన పంచాయితీ వ్యవస్థల పనితీరుపై తీవ్ర ఆరోపణలను లేవనెత్తుతోంది. వివరాల్లోకి వెళితే, అడిగినంత కట్న కానుకలు ఇవ్వలేదన్న కోపంతో మగ పెళ్లివారు నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోగా, వధువు తరపు బంధువులు పంచాయితీ పెట్టారు. పెళ్ళికి ముందు వరుడికి కారు ఇవ్వాలని డిమాండ్ చేయగా, అందుకు వధువు తరపు పెద్దలు అంగీకరించలేదు. 
 
రెండు వైపులా వాదనలు విన్న పంచాయతీ పెద్దలు మగ పెళ్లివారిదే తప్పని తేల్చి, 75 పైసలు జరిమానాగా విధించారు. అంతే కాదు, ఆ మొత్తాన్ని అనాజ్ మండిలోని శివాలయ ధర్మశాలకు విరాళంగా ఇవ్వాలని తీర్పిచ్చారు.

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments