Webdunia - Bharat's app for daily news and videos

Install App

హర్యానా ఎన్నికల తేదీల్లో మార్పు.. ఎందుకని?

ఠాగూర్
ఆదివారం, 1 సెప్టెంబరు 2024 (10:06 IST)
కేంద్ర ఎన్నికల సంఘం శనివారం హర్యానా అసెంబ్లీ ఎన్నికల తేదీని అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 5కి వాయిదా వేసింది. శతాబ్దాల నాటి బిష్ణోయ్ కమ్యూనిటీ పండుగను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇప్పుడు అక్టోబర్ 4న కాకుండా అక్టోబర్ 8న నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. 
 
ఒక రాష్ట్ర ఫలితాలు ఇతర రాష్ట్రాల ట్రెండ్‌లను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున ఈ తేదీలలో కేంద్ర ఎన్నికల సంఘం మార్పు చేసింది. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల మూడో, చివరి దశతో పాటు హర్యానా ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది. 
 
తమ గురు జంభేశ్వర్‌ను స్మరించుకుంటూ 300-400 ఏళ్ల నాటి ఆచారాన్ని కొనసాగిస్తున్న బిష్ణోయ్ కమ్యూనిటీ ఓటింగ్ హక్కులు, సంప్రదాయాలను గౌరవించేందుకు హర్యానా ఎన్నికలను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ తెలిపింది.
 
కాగా, హర్యానా ప్రజలు తమ మూలపురుషుడు గురు జంబేశ్వర్‌ స్మారకంగా అసోజ్‌ అమావాస్య పండగను నిర్వహిస్తారు. ఈ వేడుకలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. బిష్ణోయ్‌ కమ్యూనిటీ నుంచి వచ్చిన వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఈ క్రమంలో ప్రజలు తమ ఓటు హక్కును కోల్పోకూడదన్న ఉద్దేశంతో తేదీలు మార్చినట్లు ఈసీ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments