Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతిని కిడ్నాప్ చేసి.. కారులో తిప్పుతూ అత్యాచారం...

హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న ఓ యువతిని కిడ్నాప్ చేసిన నలుగురు కామాంధులు కారులో తిప్పుతూ సామూహిక అత్యాచారం జరిపారు.

Webdunia
మంగళవారం, 16 జనవరి 2018 (09:38 IST)
హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న ఓ యువతిని కిడ్నాప్ చేసిన నలుగురు కామాంధులు కారులో తిప్పుతూ సామూహిక అత్యాచారం జరిపారు. హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్‌లో శనివారం ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధితురాలి కథనం ప్రకారం..
 
విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరిన యువతి ఫోన్‌లో కుటుంబ సభ్యులతో మాట్లాడుకుంటూ రోడ్డుపై నడుస్తోంది. ఈ క్రమంలో స్కార్పియో కారులో వచ్చిన నలుగురు యువకులు ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించుకున్నారు. అనంతరం ఆమె మొబైల్ ఫోన్‌ను స్విచాఫ్ చేసి నడుస్తున్న కారులోనే ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను బల్లభ్‌గఢ్ ప్రాంతంలో పడేసి వెళ్లిపోయారు.  
 
తర్వాత ఎలాగోలా ఓపిక తెచ్చుకున్న ఆమె తన ఫోన్‌ను స్విచాన్ చేసి సోదరుడికి సమాచారం అందించింది. అంతకంటే ముందే ఆమెను గమనించిన కొందరు వాహనదారులు పోలీసు కంట్రోల్ రూముకు ఫోన్ చేసి ఆమె గురించి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments