Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీని కలుస్తా... కేంద్ర సాయం లేకుండా మనుగడ సాగించలేం : హరీశ్ రావత్

Webdunia
గురువారం, 12 మే 2016 (11:07 IST)
ఉత్తరాఖండ్ శాసనసభలో జరిగిన విశ్వాస పరీక్షలో నెగ్గడం ప్రజాస్వామ్యంపై ప్రజల విశ్వాసాన్ని న్యాయవ్యవస్థ పునరుద్ధరించిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీశ్ రావత్ అన్నారు. ఈ పోరాటంలో తనకు అండగా నిలిచిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్‌తోపాటు ఇతర కాంగ్రెస్ నేతలకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు తెలిపారు. 
 
మొత్తం 70 శాసనసభ్యులు కలిగిన అసెంబ్లీల స్పీకర్ అనర్హులుగా 9 మంది సభ్యులను అనర్హులుగా ప్రకటించారు. మిగిలిన 61 మంది విశ్వాస పరీక్షలో పాల్గొనగా, హరీశ్ రావత్‌కు 33 మంది, బీజేపీకి అనుకూలంగా 28 మంది ఓటు వేశారు. దీంతో హరీశ్ రావత్ గెలుపొందడంతో కేంద్రం రాష్ట్రపతి పాలనను ఎత్తివేసింది. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ... భవిష్యత్తులో ఉత్తరాఖండ్ అభివృద్ధికి కేంద్రం సహకారం అవసరమన్నారు. ఇందుకోసం తాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీని కలుస్తానని చెప్పారు. పాత అనుభవాలను మరిచిపోయి కొత్తగా ముందుకుపోవాల్సి ఉంటుందని అన్నారు.

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments