Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ్వరంలో వ్యాయామం - ఇంటికొచ్చి కుర్చీలో కూలిపోయిన జిమ్ యజమాని

Webdunia
గురువారం, 20 అక్టోబరు 2022 (11:13 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో ఓ విషాద ఘటన జరిగింది. జ్వరలోనూ వ్యాయామాలు చేసిన జిమ్ యజమాని ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఆయన వ్యాయామాలు పూర్తి చేసుకుని జిమ్ నుంచి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి కుర్చీలో కూర్చొన్న తర్వాత గుండెపోటు రావడంతో మృత్యువాతపడ్డారు. 
 
ఆదివారం జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, ఘజియాబాద్ ప్రాంతానికి చెందిన ఆదిల్ (33) అనే వ్యక్తి ఓ జిమ్ సెంటరును నడుపుతున్నాడు. ఈయన జిమ్‌కు వచ్చేవారితో కలిసి తాను కూడా వ్యాయామాలు చేస్తుంటారు. 
 
అయితే, గత వారం రోజులుగా జ్వరంతో బాధపడుతూ వచ్చిన ఆయన.. ప్రతి రోజూ జిమ్‌కు వచ్చి వ్యాయామం చేయసాగాడు. ఈ క్రమంలో గత ఆదివారం కూడా అతను జిమ్‌కు వెళ్లి ఇంటికొచ్చాడు. ఓవైపు జ్వరంతో బాధపడుతూనే ఆఫీసుకు వెళ్లాడు. 
 
లోపలికి వెళ్లి తన సీటులో కూర్చున్నాడో లేదో గుండెపోటుకు గురయ్యాడు. తన సీటులోనే వెనక్కి వాలిపోయాడు. పక్కనే ఉన్నవాళ్లు ఆదిల్ పరిస్థితి చూసి హుటాహుటిన సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అతనిని పరీక్షించిన వైద్యులు.. అప్పటికే చనిపోయాడని చెప్పారు.
 
ఆదిల్ మరణవార్త విని ఆయన భార్యా పిల్లలు షాక్‌కు గురయ్యారు. తన భర్త వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడని ఆదిల్ భార్య చెప్పారు. మామూలు జ్వరమేనని, తనకేమీ కాదని భర్త తేలిగ్గా తీసుకున్నాడని, ఇంతలోనే ఇలా జరుగుతుందని అనుకోలేదని వాపోయారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments