Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ యువతులా మజాకా.. పోకిరీలపై చెప్పులతో దాడి చేశారు.. వీడియో వైరల్..

ఢిల్లీలో మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అయితే వీటికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఢిల్లీ శివారులోని గురుగ్రామ్‌లో పలువురు యువతులు పోకిరీలకు గట్టిగా బుద్ధ

Webdunia
సోమవారం, 12 జూన్ 2017 (17:45 IST)
ఢిల్లీలో మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అయితే వీటికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఢిల్లీ శివారులోని గురుగ్రామ్‌లో పలువురు యువతులు పోకిరీలకు గట్టిగా బుద్ధి చెప్పారు. తద్వారా మహిళలు తమకు తామే రక్షణగా మారిపోవాలని ఈ ఘటన ద్వారా సందేశమిచ్చారు. వివరాల్లోకి వెళితే.. ఎంజీ రోడ్‌ ప్రాంతంలో రాత్రి ఒంటిగంటకు నైట్‌క్లబ్స్‌లో పని చేస్తున్న కొంతమంది అమ్మాయిలు ఇంటికి బయల్దేరారు. 
 
రోడ్డుపైకి వచ్చిన ఈ అమ్మాయిలను నలుగురు యువకులు వేధించాలనుకున్నారు. వారు అసభ్య పదజాలం వాడటంతో ఆ యువతులు హెచ్చరించారు. దీంతో అక్కడ నుంచి వెళ్ళిపోయిన ఆ యువకులు తమ వెంట పదిమందితో వచ్చి అమ్మాయిలను చుట్టుముట్టారు. వారిలో ఒకమ్మాయిని బలవంతంగా లాక్కెళుతుండగా.. మిగిలిన యువతులంతా ఏకమయ్యారు. 
 
చెప్పులతో యువకులపై దాడి చేశారు. దీంతో ఆ యువకులంతా పారిపోయారు. ఇంత జరుగుతున్నా.. ఎవరూ యువతులను కాపాడలేదు. అంతేగాక‌, త‌మ సెల్‌ఫోన్‌ల‌తో ఆ దృశ్యాల‌ను చిత్రీక‌రించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments