Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారుని బైక్ రాసుకుందని వైద్యుడిని కాల్చిపారేశాడు... ఎక్కడ?

హర్యానాలో ఓ దారుణం జరిగింది. కారును బైక్ రాసుకుందని ఓ వైద్యుడిని తుపాకీతో కాల్చి చంపేశాడు. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... హర్యానా రాష్ట్రంలోని గుర్గావ్‌కి చెందిన మహావీర్ అనే వైద్యుడు బంధువుతో కలిసి బై

Webdunia
ఆదివారం, 21 మే 2017 (12:17 IST)
హర్యానాలో ఓ దారుణం జరిగింది. కారును బైక్ రాసుకుందని ఓ వైద్యుడిని తుపాకీతో కాల్చి చంపేశాడు. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... హర్యానా రాష్ట్రంలోని గుర్గావ్‌కి చెందిన మహావీర్ అనే వైద్యుడు బంధువుతో కలిసి బైక్‌‌పై వెళ్తున్నాడు. వారి బైక్ ఫరూఖ్ నగర్ ప్రాంతంలో టర్న్ తీసుకుంటున్న క్రమంలో కారుని బైక్ రాసుకుంది. దీంతో మహావీర్‌తో కారు డ్రైవర్ వాగ్వాదానికి దిగాడు. 
 
ఇద్దరూ ఆరోపించుకోవడంతో కారు వెనుక సీట్లో కూర్చున్న డ్రైవర్ సోదరుడు రవి సీట్లోంచి లేచి, తుపాకీతో వైద్యుడిపై నడిరోడ్డు మీద విచక్షణారహితంగా కాల్పులకు దిగాడు. దీంతో మహావీర్ అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు. డ్రైవర్‌కు కూడా బుల్లెట్ దిగింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు, సంఘటనా స్థలికి చేరుకుని, డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేశారు. కాల్పులు జరిపిన రవి పారిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నాడు.

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments