Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయ దంపతుల వద్ద 45 పిస్టల్స్ స్వాధీనం

Webdunia
గురువారం, 14 జులై 2022 (11:01 IST)
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద భారతీయ దంపతులను సోదా చేయగా, వారి నుంచి ఏకంగా 45 పిస్టల్స్‌ను ఎయిర్ పోర్టు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో వారిద్దరినీ అరెస్టు చేశారు. ఈ దంపతులను జగ్జీత్ సింగ్, జస్వీందర్ కౌర్‌గా గుర్తించారు. 
 
పైగా, ఈ కేసును నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్‌ విచారిస్తుంది. ఎన్.ఎస్.జీ అధికారులు పరిశీలించి ఈ తుపాకులు నిజమైనవేనని తేల్చింది. అదేసమయంలో ఈ తుపాకులు పూర్తిగా పనిచేసే స్థితిలోనే ఉన్నాయని ఓ కస్టమ్స్ అధికారి తెలిపారు. తాము స్వాధీనం చేసుకున్న తుపాకీల విలువ రూ.22.5 లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు. 
 
మరోవైపు, అరెస్టు చేసిన దంపతులు వియత్నాంలోని హోచిమిన్ సిటీ నుంచి ఢిల్లీకి వచ్చారు. వీరివద్ద ఉన్న రెండు బ్యాగుల్లో ఈ తుపాకులను గుర్తించారు. వాటిని తన సోదరుడు మంజీతి సింగ్ ఇచ్చినట్టు జగ్జీత్ వద్ద జరిపిన విచారణలో వెల్లడించారు. 
 
ఈ పిస్టళ్లను మంజీత్ సింగ్ ఫ్రాన్స్‌లోని పారిస్ నుంచి వియత్నాంకు తెచ్చి తమకు ఇచ్చారని, వాటిని తాము ఢిల్లీకి తీసుకొచ్చినట్టు చెప్పారు. పైగా, గతంలో తామిద్దరం టర్కీ నుంచి 25 పిస్టళ్లను కూడా తెచ్చినట్టు ఈ దంపతులు పోలీసుల విచారణలో వెల్లడించారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments