Webdunia - Bharat's app for daily news and videos

Install App

నంబర్ ప్లేట్ లేదనీ రూ.27 లక్షల ఫైన్.. ఎక్కడ?

Webdunia
గురువారం, 9 జనవరి 2020 (11:26 IST)
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో ఓ కారు యజమానికి ట్రాఫిక్ పోలీసులు తేరుకోని షాకిచ్చారు. నంబరు ప్లేటు లేకపోవడంతో ఏకంగా రూ.27.68 లక్షల అపరాధం విధించారు. దేశంలో కొత్త మోటారు వాహన చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఒక వాహనచోదకుడికి విధించి అత్యధిక మొత్తం ఇదే కావడం గమనార్హం. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అహ్మదాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి విదేశం నుంచి పోర్షే రకం కారును దిగుమతి చేసుకున్నాడు. ఈ కారులో రోడ్డుపైకి వచ్చాడు. ఆ సమయంలో ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీలో నిమగ్నమైవున్నారు. ఆ సమయంలో అటుగా వచ్చిన పోర్షే కారును ఆపారు. 
 
కారుకు నంబర్ ప్లేటుతో పాటు... ఉండాల్సిన ముఖ్యమైన పత్రాలు లేవని తొలుత రూ.9.80 లక్షల అపరాధం విధించారు. పిమ్మట ఆరు వారాల తర్వాత ఈ మొత్తాన్ని సమీక్షించి జరిమానాను రూ.27.68 లక్షలకు పెంచుతున్నట్టు ఓ లేఖను ఇంటికి పంపించారు. దీంతో ఆ యజమాని మరోమార్గం లేక.. ఆ మొత్తాన్ని చెల్లించి, కారును ఇంటికి తెచ్చుకున్నారు. 
 
దేశంలో ఇదే అత్యధిక జరిమానా అని అహ్మదాబాద్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. వాహనం నడిపే సమయంలో వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్సీ), వాహన బీమా పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) సర్టిఫికేట్ తప్పనిసరని అన్నారు. ఇవి లేకుంటే భారీ అపరాధాలు చెల్లించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments