Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్‌లో కాషాయం - హిమాచల్ ప్రదేశ్‌లో హస్తం హవా

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2022 (10:31 IST)
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం మొదలైంది. ఈ ఓట్ల లెక్కింపులో గుజరాత్‌లో బీజేపీ, హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీలు విజయం దిశగా దూసుకెళుతున్నాయి. ముఖ్యంగా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో విజయం ఇటు కాంగ్రెస్, అటు బీజేపీల మధ్య దోబూచులాడాయి. 
 
చివరకు కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్‌కు చేరువైంది. ఆ పార్టీ సరిగ్గా 35 సీట్లలో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 29, కాంగ్రెస్ 35, ఇతరులు నాలుగు చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. అంటే, హిమాచల్ ప్రదేశ్ ఓటర్లు ఒకసారి అధికారంలో ఉన్న పార్టీని మళ్లీ గెలిపించిన దాఖలాలు లేవు. ఈ ఆనవాయితీని మరోమారు పునరావృతం చేశారు. దీంతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకానుంది. 
 
మరోవైపు, గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ తన హవాను కొనసాగిస్తుంది. ఆ పార్టీ ఏకంగా 155 సీట్ల ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దారుణంగా దిగజారింది. గతంతో పోల్చితే ఈ దఫా 60కు పైగా సీట్లను కోల్పోయింది. ప్రస్తుతం బీజేపీ 155 చోట్ల, కాంగ్రెస్ 18 చోట్ల, ఆప్ 6, ఇతరులు మూడు చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments