Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్‌లో విషాదం... 65 మంది ప్రయాణికులతో లోయలో పడిన బస్సు!!

వరుణ్
సోమవారం, 8 జులై 2024 (09:26 IST)
గుజరాత్ రాష్ట్రంలో విషాదకర ఘటన జరిగింది. 65 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు ఒకటి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించగా ఈ ప్రమాదానికి ప్రధాన కారణమైంది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు. 
 
ఈ బస్సు సూరత్‌లోని సపుతారా పర్వత ప్రాంతం నుంచి తిరిగివస్తుండగా ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గాయపడిన ముగ్గురు ప్రయాణికులను స్థానికంగా ఓ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి వివరాల కోసం సేకరిస్తున్నారు.
 
నిరాండబర జీవితం తన తల్లి - అమ్మమ్మల నుంచి నేర్చుకున్నా : సుధామూర్తి
 
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి, రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి రూ.కోట్లకు అధిపతి అయినప్పటికీ ఆమె ఎంతో నిరాడంబరంగా ఉంటారు. దీనివెనుక ఉన్న అసలు రహస్యాన్ని ఆమె బహిర్గతం చేశారు. తాను కాశీకి వెళ్లినపుడు తనకిష్టమైన షాపింగ్ అలవాటును అక్కడే వదిలేశానని చెప్పారు. అలాగే, తను నిరాడంబర జీవన శైలి తనకు తల్లి, అమ్మమ్మల నుంచి వారసత్వంగా సంక్రమించారు. అందుకే తాను ఎల్లవేళలా సాధారణ జీవితం గడిపేందుకు ఇబ్బంది పడలేదన్నారు. 
 
తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను 30 ఏళ్లుగా ఒక్క చీర కూడా కొనుగోలు చేయలేదంటూ ఆశ్చర్యకర విషయాన్ని వెల్లడించారు. స్నేహితులు, బంధువులు బహుమతిగా ఇచ్చిన చీరలనే ధరిస్తున్నానని చెప్పారు. తనకు చాల ఇష్టమైన షాపింగ్‌ను కాశీలో వదులుకోవడంతో చీరలు కొనుగోలు చేయలేదని తెలిపారు. తన తల్లి, అమ్మమ్మ అత్యంత సాధారణ జీవితం గడిపారని, వారి నుంచి తనకు నిరాడంబర జీవనశైలి వారసత్వంగా వచ్చిందని చెప్పారు. కాబట్టి, తను సులువుగా సర్దుకుపోగలిగానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 
 
'ఆరేళ్ల క్రితం నా తల్లి చనిపోయినప్పుడు ఆమె కప్ బోర్డును ఖాళీ చేసేందుకు ఇతరులకు ఇచ్చేందుకు ఎక్కువ సమయం పట్లలేదు. ఎందుకంటే ఆవిడ వద్ద 8 - 10 చీరలే ఉండేవి. 36 ఏళ్ల క్రితం మా అమ్మమ్మ చనిపోయింది. అప్పట్లో ఆమె వద్ద నాలుగు మాత్రమే ఉండేవి. వారందరూ అత్యంత నిరాడంబర జీవితం గడిపారు. కాబట్టి, ఆ విలువలతోనే నన్ను పెంచారు. వస్తు వ్యామోహం లేని నిరాడంబర జీవితాన్ని గడిపేందుకు నేనెప్పుడూ ఇబ్బంది పడలేదు' అని ఆమె వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments