Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోద్రా అల్లర్ల కుట్రదారుడు.. 14 యేళ్ల తర్వాత అరెస్టు

Webdunia
బుధవారం, 18 మే 2016 (15:59 IST)
గుజరాత్ రాష్ట్రంలో 2002 ఫిబ్రవరిలో గోద్రా స్టేషన్‌ సమీపంలో కొందరు వ్యక్తులు సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ రైలుపై దాడిచేసి దానికి నిప్పుపెట్టడంతో రైలు దహనమైంది. దాదాపు 60 మంది ప్రయాణికులు (వీహెచ్‌పీ కార్యకర్తలు) సజీవదహనమయ్యారు. ఈ ఘటన గుజరాత్‌లోని గోద్రాలో తీవ్ర అల్లర్లకు కారణమైంది. గోద్రా అల్లర్లలో దాదాపు వెయ్యి మంది ప్రాణాలు కోల్పోయారు. 2011 ఫిబ్రవరిలో గోద్రా రైలు దగ్ధం కేసులో ప్రత్యేక కోర్టు 31 మందిని దోషులుగా నిర్ధారించి వారిలో 11 మందికి మరణశిక్ష, 20 మందికి జీవితఖైదు విధించింది. ఆరుగురు దోషులు పరారీలో ఉన్నారు.
 
ఈనేపథ్యంలో... ఈ రైలు దగ్ధం కేసులో ఘటన జరిగి 14 ఏళ్ల తర్వాత ప్రధాన కుట్రదారు ఫరూక్‌ భానా అరెస్టయ్యాడు. గుజరాత్‌ ఉగ్రవాద వ్యతిరేక స్క్వాడ్‌ పోలీసులు బుధవారం అతడిని అదుపులోకి తీసుకున్నారు. మాజీ మున్సిపల్‌ కౌన్సిలర్‌ అయిన ఫరూక్‌ భానా రైలు దగ్ధం చేయడానికి కుట్రపన్నాడని పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేశారు. 14 ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న ఫరూక్‌ను గుజరాత్‌లో కలోల్‌ టోల్‌ నాకా వద్ద పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments