Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి విందు భోజనం ఆరగించి 1200 మంది అస్వస్థత

Webdunia
ఆదివారం, 6 మార్చి 2022 (09:56 IST)
గుజరాత్ రాష్ట్రంలో ఓ పెళ్లి విందులో అపశృతి చోటుచేసుకుంది. దీంతో 1200 మంది తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వీరంతా పెళ్లి విందు భోజనాన్ని ఆరగించిన తర్వాత అస్వస్థతకు లోనయ్యారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని మోహసనా జిల్లాలో జరిగింది. 
 
కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావం తగ్గి దేశ వ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో విందులు, వినోదాలు, శుభకార్యాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గుజరాత్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నేత తన కుమారుడు పెళ్లిని ఘనంగా నిర్వహించారు. 
 
ఈ పెళ్లికి భారీ సంఖ్యలో అతిథులు తరలివచ్చారు. ఈ పెళ్లితంతు ముగిసిన తర్వాత పెళ్లి విందు భోజనం ఆరగించారు. అయితే, ఈ భోజనం కలుషితమై ఉండటంతో వారంతా అస్వస్థతకు గురయ్యారు. 
 
ఈ ఆహారం ఆరగించిన చాలా మందికి వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయి. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు. విందులో ఏర్పాటు చేసిన ఆహార నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. 
 
మరోవైపు, ఈ ఘటనపై ఫుడ్ అండ్ డ్రగ్ విభాగం అధికారులు దర్యాప్తు చేపట్టారు. విందులో అతిథులు వడ్డించిన ఆహార పదార్థాల్లో మాంసాహారం కూడా ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ విందులో ఉపయోగించిన మాంసం నిల్వ చేయడం వల్ల ఇలా జరిగిందా? లేక వేరే కారణాలా? అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఛాన్స్ వస్తే ముద్దు సీన్‌ - హగ్ సీన్లలో నటిస్తా : రీతూవర్మ

తమిళ హీరో అజిత్ కుమార్‌ తప్పిన ప్రాణముప్పు.. ఎందుకని? (Video)

అసలే ఎండాకాలం.. రోజుకు 11 సార్లు నీళ్ళు తాగాలి.. నటుడు పృథ్వీ ట్వీట్

Tamannaah Bhatia : ఓదెలా-2 టీజర్ లాంఛ్.. నిజంగా అదృష్టవంతురాలిని.. తమన్నా (video)

వరుస సినిమాలను లైనులో పెట్టిన చిరంజీవి.. హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియాలజీ సేవలను బలోపేతం చేయడానికి అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ప్రారంభించిన మణిపాల్ హాస్పిటల్

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

తర్వాతి కథనం
Show comments