Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధిక కట్నం డిమాండ్ చేసిన వరుడు.. చెట్టుకు కట్టేసిన వధువు బంధువులు

Webdunia
శుక్రవారం, 16 జూన్ 2023 (12:25 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కట్నం మరింతగా ఎక్కువగా అడిగిన వరుడిని వధువు కుటుంబ సభ్యులు చెట్టుకు కట్టేసి అవమానించారు. ఈ ఘటన రాష్ట్రంలోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వార్త వెలుగులోకి వచ్చింది. 
 
ఈ జిల్లాలో పెద్దలు కుదిర్చిన వివాహంలో భాగంగా అక్కడి సంప్రదాయ "జై మాల" వేడుకలో వరడుు, వధువు కుటుంబాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వరుడు అమర్జీత్ వర్మ స్నేహితులు వధువు కుటుంబ సభ్యుల పట్ల అనుచితంగా ప్రవర్తించారు. దీంతో వధూవరుల కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరిగింది. ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన వరుడు.. దీనికి మరింతగా ఆజ్యం పోస్తూ వధువు కుటుంబం నుంచి కట్నాన్ని మరింతగా డిమాండ్ చేశారు. దీంతో పరిస్థితి చేయిదాటిపోయింది. 
 
ఈ వ్యవహారంపై పంచాయతీ పెద్దలు జోక్యం చేసుకుని ఇరు కుటుంబాల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆగ్రహించిన వధువు తరపు బంధువులు వరుడిని చెట్టుకు తాళ్లతో కట్టేశారు. దీనిపై వరుడు తరపు బంధువులు పోలీసులకు సమాచారం చేరవేయడంతో వారు అక్కడకు చేరుకుని తాళ్ళతో చెట్టుకు కట్టేసిన వరుడిని విడిపించారు. ఈ వ్యవహారంపై పోలీసులు ఇరు కుటుంబాల మధ్య విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments