Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యకు క్యాన్సర్.. వేరొక మహిళతో సంబంధాలు.. సొంత ఇంటికే కన్నం వేశాడు..

Webdunia
బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (14:17 IST)
భార్య క్యాన్సర్‌తో బాధపడుతుందని తెలియగానే వేధింపులు మొదలెట్టాడు. అతని వేధింపులు తాళలేక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలా కొన్నాళ్లు జైలులో గడిపారు. అంతే జైలు నుంచి విడుదలయ్యాక కక్ష్య పెంచుకున్న అతడు సొంత ఇంటికి కన్నం వేశాడు. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. 47 ఏళ్ల మహిళకు 25 ఏళ్ల క్రితం సురేంద్ర సింగ్‌తో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. సురేంద్ర ఓ ప్రైవేటు సంస్థలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అయితే భార్యకు క్యాన్సర్ అని తెలియరావడంతో ఆమెను వేధింపులకు గురి చేశాడు. అతడి వేధింపులు తాళలేక భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలా జైలుకెళ్లిన అతడు తిరిగి రావడంతో.. భార్య వుంటున్న సొంత ఇంటికే కన్నం వేశాడు. 
 
సురేంద్ర తన సోదరుడు శైలేంద్ర, స్నేహితుడు నితిన్‌తో కలిసి.. సొంతింట్లోని బంగారాన్ని కాజేశాడు. ఈ వ్యవహారంపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు క్యాన్సర్ వుందని తెలిశాక, సురేంద్ర వేరొక మహిళలతో గడుపుతున్నాడని.. ఆమెను పెళ్లాడేందుకే తన బంగారాన్ని కాజేశాడని పోలీసులకు చేసిన ఫిర్యాదులో తెలిపింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీలో వున్న సురేంద్ర కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments