Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్వేపల్లి రాధాకృష్ణన్ మనువడు కేశవ్ ఇకలేరు

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (11:20 IST)
భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ మనువడు, విశ్రాంత ఐఏఎస్ అధికారి కేశవ్ దేశిరాజు కన్నుమూశారు. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన ఈయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈయన మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ కుమార్తె దేశిరాజు శకుంతల కుమారుడే కేశవ్ కావడం గమనార్హం. 
 
కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చదువుకున్న కేశవ్ సివిల్స్‌లో సత్తాచాటి ఉత్తరాఖండ్ క్యాడర్ ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. కేంద్ర ఆరోగ్య, వినియోగదారుల వ్యవహారాల శాఖల కార్యదర్శిగా పనిచేశారు. పదవీ విరమణ తర్వాత చెన్నై రాయపేటలో ఉంటూ వచ్చారు. 
 
ఈ క్రమంలో ప్రముఖ గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి జీవిత చరిత్రపై ఆయన రాసిన పుస్తకానికి మంచి పేరు వచ్చింది. ఈయన తండ్రి నరసింహా రావు సైన్యంలో మేజర్‌గా సేవలందించారు. కేశవ్ మృతికి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, శశిథరూర్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మౌత్ పబ్లిసిటీ పై నమ్మకంతో చౌర్య పాఠం విడుదల చేస్తున్నాం : త్రినాథరావు నక్కిన

జూ.ఎన్టీఆర్ ధరించిన షర్టు ధర రూ.85 వేలా?

సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంగా కిచ్చా సుదీప్ తో బిల్లా రంగ బాషా ప్రారంభం

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments