Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమోసాలు తీసిస్తానని తాత, మేనమామ బాలికపై గ్యాంగ్ రేప్.. రూ.20లను ఇచ్చి..?

Webdunia
శనివారం, 10 ఏప్రియల్ 2021 (19:34 IST)
మహిళలపై వయోబేధం లేకుండా, వావి వరుసలు లేకుండా లైంగిక దాడులు జరుగుతూనే వున్నాయి. కఠిన చట్టాలు తీసుకువచ్చినా మహిళలు, చిన్నారులపై లైంగిక దాడి ఘటనలు తగ్గట్లేదు. తాజాగా ఆరేళ్ల బాలికపై ఆమె తాతయ్య, మేనమామ లైంగిక దాడికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో చోటుచేసుకుంది. 
 
బాలిక సోదరుడి ముందే వారు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఎనిమిది రోజుల కిందట జరిగిన ఈ ఘోరం గురువారం సాయంత్రం వెల్లడైంది. బాలిక ప్రవర్తనలో మార్పులు గమనించిన తల్లి ప్రశ్నించడంతో జరిగిన విషయం బాధితురాలు వివరించింది.
 
ఆపై వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులపై కేసు నమోదైంది. కొద్దిరోజుల కిందట తన మేనమామ సమోసాలు ఇస్తానని తనను, తన సోదరుడిని బంధువుల ఇంటికి తీసుకువెళ్లాడని, అక్కడ అప్పటికే తాత ఉన్నాడని బాధితురాలు పేర్కొంది. 
 
వారు సోదరుడి ఎదుటే తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో తెలిపింది. నిందితులు బాలికకు రూ.20 ఇచ్చి ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని కోరారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం