లతా మంగేష్కర్ అస్తమయం : రెండు రోజులపాటు సంతాప దినాలు

Webdunia
ఆదివారం, 6 ఫిబ్రవరి 2022 (12:31 IST)
భారత సినీ దిగ్గజ గాయని లతా మంగేష్కర్ అస్తమించారు. ఆమె ఆదివారం ముంబైలోని బ్రీచ్‌కాండీ ఆస్పత్రిలో కన్నుమూశారు. అయితే, ఆమె మృతి పట్ల ప్రధాని నరేంద్రమోడీ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. అంతేకాకుండా ఆమె జ్ఞాపకార్థం ప్రభుత్వం రెండు రోజుల జాతీయ సంతాప దినాలు ప్రకటించింది. 
 
నైటింగేల్ ఆఫ్ ఇండియా లతా మంగేష్కర్ 92 ఏళ్ల వయసులో ముంబైలోని క్యాండీ బ్రీచ్ హాస్పిటల్‌లో కన్నుమూశారు. లతా మంగేష్కర్ నవల కరోనా వైరస్ సోకడంతో ఆమెను బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లోని ఐసియులో చేరిన సంగతి తెలిసిందే. అక్కడ చికిత్స పొందే సమయంలో తిరిగి న్యుమోనియా బారినపడ్డారు. దీంతో ఆమె తిరిగి కోలుకోలేక అస్తమించారు. 
 
ఈ నేపథ్యంలో ఈ నెల 6వ తేదీ నుంచి 7వ తేదీ వరకు సంతాప దినాలను ప్రకటించారు. ఆమెకు గౌరవ సూచకంగా ఈ రెండు రోజుల పాటు జాతీయ పతాకాన్ని ప్రభుత్వ కార్యాలయాలపై అవనతం (జాతీయ జెండాను సగం ఎత్తులోనే పతాకం ఎగురవేసి ఉంచడం) చేస్తారు అని ప్రభుత్వం తెలిపింది. 
 
ఇదిలావుంటే, లతా మంగేష్కర్ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు వరకు ప్రభుకుంజ్‌లోని ఆమె నివాసంలో ఉంచుతారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో ముంబైలోని శివాజీ పార్కులో అంత్యక్రియలు నిర్వహిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: క్లైమాక్స్ ఫైట్ షూటింగ్ లో మన శంకరవరప్రసాద్ గారు

Prashanth Varma: నా పై ఆరోపణలు అబద్దం, ప్రతీకారం గా జరుగుతున్నాయి: ప్రశాంత్ వర్మ

Suma: దంపతుల జీవితంలో సుమ కనకాల ఎంట్రీ తో ఏమయిందనే కథతో ప్రేమంటే

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments