Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశవ్యాప్తంగా గూడ్స్ రైళ్లు పరుగులు

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2020 (10:15 IST)
లాక్‌ డౌన్‌ కారణంగా రవాణా స్తంభించింది. దీంతో ఆహార నిల్వల కొరత ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. దీనిని ముందుగానే పసిగట్టిన కేంద్రం మేల్కొంది. రైల్వే ద్వారా దీనిని ఎదుర్కోవాలని నిర్ణయించింది.

ఇందులో భాగంగా గూడ్స్ రైళ్లను పరుగులు పెట్టిస్తోంది. దేశమంతటా అత్యవసరాలను రవాణా చేసేందుకు రైల్వే శాఖ టైమ్‌ టేబుల్‌ పార్సిల్‌ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది.

లాక్‌ డౌన్‌ ప్రారంభమైన నాటి నుంచి మొత్తం 58 రూట్లలో 109 రైళ్లను ప్రకటించినట్లు చెప్పింది. ఏప్రిల్‌ 5 వరకూ 27 రూట్లు నోటిఫై చేయగా, అందులో 17 రూట్లు ఇప్పటికే సర్వీసులు నడుస్తున్నాయి. మిగిలిన రూట్లలో సింగిల్‌ ట్రిప్‌లు మాత్రమే జరుగుతున్నాయి.

ప్రస్తుతం మరో 40 రూట్లను వీటికి జత చేయనున్నట్లు ప్రకటించారు. దీనివల్ల దేశంలోని అన్ని ప్రాంతాలకు రవాణా జరుగుతుందని అధికారులు తెలిపారు.

ప్రత్యేకించి నిత్యావసరాలు, అత్యవసర పరిశ్రమలకు సంబంధించిన సరుకు, వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేయవచ్చని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments