Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఢీకొన్న గూడ్సు రైళ్లు... పట్టాలు తప్పిన 12 వ్యాగన్లు

Webdunia
ఆదివారం, 25 జూన్ 2023 (09:33 IST)
ఇటీవలి కాలంలో దేశ వ్యాప్తంగా తరచుగా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఒరిశా రాష్ట్రంలోని బహనగ బజార్ వద్ద కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ గూడ్సు రైలును ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 292 మంది చనిపోయారు. అప్పటి నుంచి దేశంలో ఎక్కడో చోట రైలు ప్రమాదం జరుగుతూనే వుంది. 
 
తాజాగా పశ్చిమబెంగాల్‌లోని బంకురా జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. అడ్రా డివిజన్‌ పరిధిలోని ఓండా స్టేషన్‌కు సమీపంలో రెండు గూడ్స్‌ రైళ్లు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనతో 12కిపైగా వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ప్రమాద తీవ్రతకు ఓ గూడ్స్‌ రైలు ఇంజిన్‌.. మరో వ్యాగన్‌‌పైకి చేరింది. ఈ ఘటనతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగింది. రైల్వే సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. 
 
ఈ ప్రమాదం కారణంగా 14 రైళ్లను ఆదివారం రద్దు చేసినట్లు సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వే ప్రకటించింది. మరికొన్నింటిని తాత్కాలికంగా రద్దు చేశామని.. కొన్ని రైళ్లను దారి మళ్లించామని తెలిపింది. ఈ మేరకు ఆ వివరాలను ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కల్యాణ్ పైన పోసాని, శ్రీరెడ్డి దుర్భాషలు: ఏపీ హోం మంత్రికి గబ్బర్ సింగ్ సాయి కంప్లైంట్

రామ్ చరణ్ బ్యాక్ ఫోజ్ సూపర్.. గేమ్ ఛేంజర్‌లో కలుద్దాం

అమ్మతోడుగా చెబుతున్నా.. కోర్టులు దోషిగా నిర్ధారించలేదు.. అప్పటివరకు నిర్దోషినే : నటి హేమ

నిజమైన భారతీయుడు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్: ఎస్.జె సూర్య (Video)

రూ.1,000 కోట్ల క్లబ్‌కు చేరువలో ప్రభాస్ "కల్కి 2898 AD"

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments