కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్‌

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2022 (22:49 IST)
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పబోతోంది కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ భారీ బహుమతులు ఇవ్వబోతోంది. ఉద్యోగులకు త్వరలో డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) పెంచనుంది. నేటి నుండి 18 రోజుల తర్వాత డీఏ పెంపు డబ్బులు వారి వారి బ్యాంకు అకౌంట్లో పడే అవకాశం ఉంది. 
 
మీడియా నివేదికల ప్రకారం, సెప్టెంబర్ 28న నవరాత్రులు ప్రారంభమైన రెండు రోజుల తర్వాత ప్రభుత్వం కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు పెద్ద ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది. 
 
సెప్టెంబర్ 28న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) పెంపును ప్రకటించే అవకాశం ఉంది. గత మార్చి 2022లో కేంద్ర ఉద్యోగుల డీఏను ప్రభుత్వం పెంచింది. 
 
అప్పట్లో ఉద్యోగుల డీఏలో 3 శాతం పెంపు ఉండేది. దీంతో డీఏ 31 శాతం నుంచి 34 శాతానికి పెరిగింది. ప్రస్తుతం కేంద్ర ఉద్యోగులకు 34 శాతం చొప్పున డీఏ చెల్లిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments