Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ కరోనా వైరస్‌ను దేవుడే భూమ్మీదికి పంపాడు : అస్సోం మంత్రి

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (16:58 IST)
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ గురించి ఒక్కో వీఐపీ ఒక్కో విధంగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ వైరస్ చైనాలోని వూహాన్ ప్రయోగకేంద్రం నుంచి పుట్టిందని చాల మంది గట్టిగా నమ్ముతున్నారు. ఇంకొందరు మాత్రం మరోలా స్పందిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో కొవిడ్‌-19పై అసోం మంత్రి చంద్ర మోహ‌న్ ప‌ట‌వ‌రి ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కరోనా వైర‌స్ ప‌రిస్ధితికి దేవుడే కార‌ణ‌మ‌న్నారు. భ‌గ‌వంతుడి సూప‌ర్ కంప్యూట‌ర్ కొవిడ్‌-19 వైర‌స్‌ను భూమి మీద‌కు పంపింద‌ని, ఇందులో మాన‌వ ప్ర‌మేయం ఏమీ లేద‌ని అన్నాడు. క‌రోనా ఎవ‌రికి సోకాలి.. ఎవ‌రికి రాకూడ‌డు.. ఈ భూమిపై ఎవ‌రికి నూక‌లు చెల్లాయ‌నేది ప్ర‌కృతే నిర్ణ‌యించింద‌ని పేర్కొన్నాడు.
 
రెండు శాతం మ‌ర‌ణాల రేటుతో కంప్యూట‌ర్ కొవిడ్‌-19ను భూమిపైకి పంపాల‌ని నిర్ణ‌యించింద‌ని చెప్పుకొచ్చాడు. ఇక అసోంలో తాజాగా 562 కరోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. రాష్ట్రంలో క‌రోనా పాజిటివిటీ రేటు 2.75 శాతంగా న‌మోదైంద‌ని అధికారులు వెల్ల‌డించారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments