యూపీఏ హయాంలో జరిగిన అగస్టా వెస్ట్ల్యాండ్ స్కామ్పై ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలపై అభియోగాలున్న సంగతి తెలిసిందే. వీవీఐపీ చాపర్ కంపెనీ అగస్టా స్కామ్ విచారణలో లంచం ఇచ్చినట్లు తేలడంతో.. లంచాన్ని ఎవరెవరు పుచ్చుకున్నారో తేలాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది.
ఈ నేపథ్యంలో అగస్టా మధ్య వర్తి గుయ్డే హస్కే అనే వ్యక్తితో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి, రాహుల్ అనుచరుడు కనిష్క సింగ్కు సంబంధాలున్నట్లు బీజేపీ ఎంపీ కిరీట్ సోమయ్య చేసిన ఆరోపణలపై రాహుల్ గాంధీ స్పందించారు.
అగస్టా స్కామ్లో తనను టార్గెట్ చేస్తుండటం మంచిదే అన్నారు. అంతేగాకుండా.. తనను లక్ష్యం చేసుకుని ఆరోపణలు వస్తున్నా హ్యాపీగా ఉన్నానని చెప్పుకొచ్చారు. ఇంకా హస్కే పేరు కామెన్వెల్త్ స్కామ్లోనూ ఉందని సోమయ్య పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అగస్టాలో తన ప్రమేయం ఉందని సోమయ్య చేసిన వ్యాఖ్యలను కనిష్క సింగ్ కూడా ఖండించారు.