Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో 6 గంటల తర్వాత అమ్మాయిలు బయటకువస్తే?!: పారికర్

Webdunia
శుక్రవారం, 25 జులై 2014 (18:13 IST)
గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళల భద్రతపై పారికర్ చేసిన వ్యాఖ్యలతో మళ్లీ చిక్కుల్లో పడ్డారు. ‘మా రాష్ట్రం గోవాలో అయితే ఎలాంటి భయం లేకుండా అర్ధరాత్రి కూడా అమ్మాయిలు తిరగొచ్చు.

అదే ఉత్తరప్రదశ్ రాష్ట్రంలో సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత అమ్మాయిలు రోడ్డు మీదకు వస్తే చాలు.. మాయమైపోతారు' అని ఆయన అన్నారు. కొన్ని రాష్ట్రాలు పనిగట్టుకుని గోవా పేరును చెడగొట్టి, తద్వారా గోవాకు వస్తున్న లక్షలాది మంది పర్యాటకులను తమ రాష్ట్రాలు ఆకర్షించేందుకు యత్నిస్తున్నట్లు మనోహర్ పారికర్ ఆరోపించారు. 
 
ఓ పెద్ద న్యూస్ ఛానల్ కూడా పనిగట్టుకుని గోవా పేరును చెడగొట్టేందుకు పనిచేస్తోందని పారికర్ ధ్వజమెత్తారు. వాళ్లకు గోవా మీద ఏవో హక్కులు ఉన్నట్లు ప్రవర్తిస్తున్నారని, అందుకే అసలా ఛానల్ చూడటమే మానేశానని చెప్పారు. మనం ఏ విషయన్నైనా రెండు రకాలుగా చూడొచ్చని చెప్పిన మనోహర్ పారికర్.. మనం స్వాతంత్ర్య సమరయోధుడిగా చూస్తున్న భగత్ సింగ్, బ్రిటీషు వారికి తీవ్రవాదిలా కనిపించాడని ఉదాహరించారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments