అత్యాచారం చేశాడు.. గర్భవతి అయ్యింది.. ఆపై యాసిడ్తో దాడి చేస్తానన్నాడు..
మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అమ్మాయిపై అత్యాచారం చేయడమే కాకుండా ఆపై యాసిడ్తో దాడి చేస్తానని ఓ యువకుడు బెదిరించిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వె
మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అమ్మాయిపై అత్యాచారం చేయడమే కాకుండా ఆపై యాసిడ్తో దాడి చేస్తానని ఓ యువకుడు బెదిరించిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భోపాల్ నగరం పరిధిలోని ఎంపీనగర్ ప్రాంతంలో ఉన్న షాపింగ్ మాల్ ప్రాంతంలో 18 ఏళ్ల అమ్మాయితోపాటు ఆమె తల్లీ స్కూటీపై ఇంటికి వెళ్లేందుకు రెడీ అయ్యారు.
ఇంతలో రూపేష్ జైస్వాల్, అర్పిత సక్సేనాలు తల్లీ కూతుళ్లను అడ్డుకొని వారిపట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించారు. యాసిడ్తో దాడి చేస్తామని అమ్మాయిని బెదిరించారు. ఈ సంఘటనపై అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరునెలల క్రితం తనపై రూపేష్ అత్యాచారం చేయడంతో తాను గర్భవతి అయ్యానని అమ్మాయి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
రూపేష్ తన స్నేహితుల సహకారంతో ఓ ప్రైవేటు క్లినిక్ లో తనకు అబార్షన్ చేయించాడని, ఆపై యాసిడ్ తో దాడి చేస్తానని బెదిరిస్తున్నాడని అమ్మాయి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు.