Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్ డౌన్ విధించినా.. ఆగని అత్యాచారాలు.. కాటేస్తున్న కామాంధులు

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2020 (09:49 IST)
కరోనా మహమ్మారి లాంటి వ్యాధులు భయపెడుతున్నా.. దేశంలో అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. లాక్ డౌన్ విధించినా.. పోలీసుల భద్రత పటిష్టంగా వున్నా.. కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. గుంటూరులో చిన్నారిపై అత్యాచారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా నకరికల్లు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై అదే గ్రామానికి చెందిన మరియానందం (48) అత్యాచారానికి ఒడిగట్టాడు. 
 
బాలిక తండ్రి మూడేళ్ల కిందట చనిపోయాడు. తల్లి కూలీ పనులు చేస్తూ ముగ్గురు కూతుళ్లు, కొడుకుని పోషిస్తోంది. గురువారం(ఏప్రిల్ 23,2020) మధ్యాహ్నం బాలిక ఇంట్లో వారంతా మిర్చి కోతలకు వెళ్లారు. బాలిక ఒంటరిగా ఇంట్లో ఉంది. ఇదే అదనుగా మరియానందం బాలికను బలవంతంగా తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
 
మధ్యాహ్నం పనులకు వెళ్లి వచ్చిన తల్లికి బాలిక విషయాన్ని తెలిపింది. తల్లి ఫిర్యాదు మేరకు నకరికల్లు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు మరియానందాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల కోసం నరసరావుపేట ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments