Webdunia - Bharat's app for daily news and videos

Install App

తన కోర్కెకు లొంగలేదని యువతిని గొడ్డలితో నరికి చంపిన మృగాడు!

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2015 (15:25 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని ధోల్‌పూర్ ఏరియాలో ఈ దారుణం జరిగింది. తన కోర్కె తీర్చుకునేందుకు ఓ యువతిని చెరబట్టాడు. ఆమె ఎంతకీ లొంగక పోగా ఎదురుతిరిగింది. దీన్ని జీర్ణించుకోలేని ఆ కామాంధుడు ఆ వ్యక్తిని గొడ్డలితో నరికి చంపాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ధోల్‌పూర్ సమీపంలోని బసేది ప్రాంతానికి చెందిన ఓ 16 ఏళ్ల బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. దీన్ని గమనించిన అదే ప్రాంతానికి చెందిన విష్ణు ఠాకూర్‌ అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించాడు. బాలికను అత్యాచారం చేసేందుకు యత్నించాడు. బాలిక అతడిని అడ్డుకుని, చుట్టుపక్కల వారికి వినిపించేలా కేకలు వేసింది. 
 
దీంతో సదరు వ్యక్తి పక్కనే ఉన్న గొడ్డలితో బాలికపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ బాలిక అక్కడికక్కడే మృతిచెందింది. బాలిక కేకలు విన్న స్థానికులు ఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని పట్టుకున్నారు. కాళ్లు చేతులు కట్టేసి దేహశుద్ధి చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపంచనామాకు తరలించారు. ఆ తర్వాత కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments