Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ పోరాటానికి సెల్యూట్ : టీబీజేపీ నేతలకు మోడీ - షా అభినందనలు

Webdunia
శనివారం, 5 డిశెంబరు 2020 (09:23 IST)
అమితాసక్తినిరేపిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎవరూ ఊహించని విధంగా, గతంలో ఎన్నడూ లేనివిధంగా 48 డివిజన్లలో విజయభేరీ మోగించింది. ఈ ఫలితాలు ఆ పార్టీకి చెందిన కేంద్ర, రాష్ట్ర స్థాయి నేతలు అమితమైన ఆనందానికి లోను చేశాయి. ముఖ్యంగా, తెలంగాణ బీజేపీ నేతల్లో కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. దీంతో బీజేపీ పెద్దలు రాష్ట్ర నేతలకు ఫోన్లు చేసి ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, జీహెచ్ఎంసీ బీజేపీ ఎలక్షన్ కమిటీ ఛైర్మన్ కిషన్ రెడ్డిని ప్రధాని నరేంద్ర మోడీ ఫోనులో అభినందించారు. గ్రేటర్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించారంటూ ప్రశంసించారు. కిషన్ రెడ్డికి బీజేపీ నేషనల్ చీఫ్ జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా సైతం ఫోన్ చేసి అభినందనల జల్లు కురిపించారు.
 
అటు అమిత్ షా తెలుగులో ట్వీట్ చేసి తమ ఉత్సాహాన్ని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో అభివృద్ధే లక్ష్యంగా బీజేపీ సాగిస్తున్న రాజకీయాలపై విశ్వాసం ఉంచిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు అని ట్వీట్ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అద్భుతమైన ప్రదర్శనకుగాను జేపీ నడ్డా గారికి, బండి సంజయ్‌కు అభినందనలు అని పేర్కొన్నారు. తెలంగాణ బీజేపీ కార్యకర్తల కృషిని అభినందిస్తున్నాను అని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments