అత్యాచార నిందితుడు దేశ సంపదగా అభివర్ణించిన జడ్జి!!

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (08:10 IST)
ఇటీవల గౌహతి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అజిత్ బోర్తాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని ‘దేశ భవిష్యత్ సంపద’గా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలు ఒక్క న్యాయ వర్గాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా వివాదస్పదమయ్యాయి. 
 
ఈ ఏడాది మార్చి 28న నిందితుడు తనతో మద్యం తాగించాడని, తాను స్పృహలో లేని సమయంలో అత్యాచారానికి తెగబడ్డాడన్న ఐఐటీ విద్యార్థిని ఫిర్యాదుపై కేసు నమోదైంది. ఏప్రిల్‌లో నిందితుడిని అరెస్టు చేశారు. బెయిలు కోసం తాజాగా అతడు దరఖాస్తు చేసుకున్నాడు. 
 
ఈ విచారణ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. 'బాధితురాలు, నిందితుడు ఇద్దరూ ఇద్దరూ 21 ఏళ్లలోపు వారేనని, వారు 'దేశ భవిష్యత్ సంపద' అని వ్యాఖ్యానించారు. ఈ కేసులో ఇప్పటికే విచారణ పూర్తికావడంతో చార్జిషీటు వేసే వరకు నిందితుడిని జైలులో ఉంచాల్సిన అవసరం లేదని పేర్కొంటూ బెయిలు మంజూరు చేశారు. ఈ తీర్పు వివాదమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments