Webdunia - Bharat's app for daily news and videos

Install App

#GandhiJayanti నేతల నివాళులు... దేశ వ్యాప్తంగా గాంధీ పండుగ

Webdunia
బుధవారం, 2 అక్టోబరు 2019 (10:40 IST)
మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోడీలు ఘన నివాళులు అర్పించారు. ఢిల్లీలోని రాజ్‌ ఘాట్ వద్ద వారు పుష్పగుచ్చాలు వుంచి నివాళులు అర్పించారు. అలాగే, దేశ వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. 
 
ముఖ్యంగా, ఈ గాంధీ జయంతి వేడుకలకు ప్రత్యేక ఉన్న విషయం తెల్సిందే. గాంధీ 150వ జయంతి వేడుకల పేరుతో వీటిని నిర్వహిస్తోంది. ఇందులోభాగంగా, కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తోంది. దేశంలో ప్లాస్టిక్ వాడకాన్ని మానుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. 
 
ఇకపోతే, తెలంగాణ రాష్ట్రంలో గాంధీ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించారు. ఆ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్‌లు బాపూజీకి నివాళులు అర్పించారు. అలాగే, ఏపీలో కూడా గవర్నర్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్‌లు నివాళులు అర్పించారు.
 
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లు కూడా గాంధీకి నివాళి అర్పించారు. "శాంతి కాముకుడు, హరిత విప్లవకర్త, జై జవాన్ జై కిసాన్ అని నినదించి దేశాన్ని ముందుకు నడిపిన ధీరోదాత్తుడు, భారత మాజీ ప్రధాని, భారతరత్న లాల్ బహదూర్ శాస్త్రిగారి జయంతి సందర్భంగా, ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పిస్తున్నాను" అంటూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments