Webdunia - Bharat's app for daily news and videos

Install App

గడ్చిరోలిలో ఎదురుకాల్పులు : 13 మంది మావోయిస్టుల మృతి?

Webdunia
శుక్రవారం, 21 మే 2021 (10:28 IST)
మహారాష్ట్రలోని గడ్చిరోలిలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 13 మంది వరకు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. 
 
నిజానికి దేశాన్ని కరోనా వైరస్ పట్టిపీడిస్తోంది. దీంతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. మరోవైపు మహారాష్ట్రలో శుక్రవారం ఉదయం భారీ‌ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. గడ్చిరోలి జిల్లాలోని ఎటపల్లి అటవీ ప్రాంతంలోవద్ద సీ-60 యూనిట్‌ మహారాష్ట్ర పోలీసులకు, మావోయిస్టులకు మధ్య పెద్ద ఎత్తున ఎదురుకాల్పులు జరిగాయి. 
 
అయితే, పోలీసుల కాల్పుల్లో ఏకంగా 13 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. మృతుల సంఖ్య ఇంకా ఉండవచ్చని భావిస్తున్నారు. ఇప్పటివరకు 13 మృతదేహాలను, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాల్పులు కొనసాగుతుండటంతో ప్రస్తుతం గడ్చిరోలి ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. 
 
కాగా, పెద్ద ఎత్తున మావోయిస్టులు మృతి చెందడంతో దండకారణ్యం నెత్తురోడింది. ధనోరా తాలుకా కోట్మీ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడినట్టు సమాచారం. ప్రస్తుతం ఏటపల్లిలో ఏరియాలో పోలీసులు గాలింపు చర్యలు, కూంబింగ్ కొనసాగిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

తర్వాతి కథనం
Show comments