Webdunia - Bharat's app for daily news and videos

Install App

గడ్చిరోలిలో ఎదురుకాల్పులు : 13 మంది మావోయిస్టుల మృతి?

Webdunia
శుక్రవారం, 21 మే 2021 (10:28 IST)
మహారాష్ట్రలోని గడ్చిరోలిలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 13 మంది వరకు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. 
 
నిజానికి దేశాన్ని కరోనా వైరస్ పట్టిపీడిస్తోంది. దీంతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. మరోవైపు మహారాష్ట్రలో శుక్రవారం ఉదయం భారీ‌ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. గడ్చిరోలి జిల్లాలోని ఎటపల్లి అటవీ ప్రాంతంలోవద్ద సీ-60 యూనిట్‌ మహారాష్ట్ర పోలీసులకు, మావోయిస్టులకు మధ్య పెద్ద ఎత్తున ఎదురుకాల్పులు జరిగాయి. 
 
అయితే, పోలీసుల కాల్పుల్లో ఏకంగా 13 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. మృతుల సంఖ్య ఇంకా ఉండవచ్చని భావిస్తున్నారు. ఇప్పటివరకు 13 మృతదేహాలను, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాల్పులు కొనసాగుతుండటంతో ప్రస్తుతం గడ్చిరోలి ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. 
 
కాగా, పెద్ద ఎత్తున మావోయిస్టులు మృతి చెందడంతో దండకారణ్యం నెత్తురోడింది. ధనోరా తాలుకా కోట్మీ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడినట్టు సమాచారం. ప్రస్తుతం ఏటపల్లిలో ఏరియాలో పోలీసులు గాలింపు చర్యలు, కూంబింగ్ కొనసాగిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ధనుష్, సందీప్ కిషన్ సన్ ల రాయన్ థియేట్రికల్ రిలీజ్ డేట్ ఫిక్స్

కర్నాటక, హైదరాబాదు లో ప్రతి లొకేషన్ కి నెమలి వచ్చేది: హరోం హర డైరెక్టర్ జ్ఞానసాగర్ ద్వారక

తుఫాను హెచ్చరిక టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల

యేవ‌మ్ టీమ్‌ను చూస్తుంటే ముచ్చ‌ట‌గా వుంది: మాస్ కా దాస్ విశ్వ‌క్‌సేన్

పుష్ప‌-2 ప్రోడక్ట్ పనుల్లో సుకుమార్ తో టెక్నీషియన్ విభేదాలు?

బ్రెయిన్ ట్యూమర్ సర్వైవర్స్‌తో అవగాహన వాకథాన్‌ని నిర్వహించిన కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలిపే 9 కారణాలు

ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం 2024: గర్భిణీ తల్లులకు సురక్షితమైన ఆహార చిట్కాలు

చెరకు రసంతో ప్రయోజనాలు సరే.. అలాంటి వారికి ఇక్కట్లే..

మజ్జిగ ఇలాంటివారు తాగకూడదు, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments