Webdunia - Bharat's app for daily news and videos

Install App

7 నుంచి విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల తరలింపు

Webdunia
సోమవారం, 4 మే 2020 (20:01 IST)
కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఇతర దేశాల్లో చిక్కుకున్న భారతీయుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

భారత్‌లో లాక్‌డౌన్ అమలు నేపథ్యంలో విదేశీ రాకపోకలపై కేంద్రం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఉపాధి కోసం, ఉద్యోగ నిమిత్తం ఇతర దేశాలకు వెళ్లి భారత్‌కు తిరిగి రావాలనుకుంటున్న భారతీయులకు కేంద్రం తాజాగా శుభవార్త చెప్పింది.
 
మే 7 నుంచి విదేశాల నుంచి వచ్చే భారతీయుల కోసం విమానాలు, నౌకలు నడపనున్నట్లు కేంద్రం ప్రకటించింది. విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల జాబితాను భారతీయ ఎంబసీలు, హై కమిషన్లు సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది.

అయితే.. ఈ విమానాలు, నౌకల్లో రావాలనుకునే భారతీయులు రవాణా ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. అంతేకాదు, మెడికల్ స్క్రీనింగ్ నిర్వహించిన అనంతరం.. కరోనా లక్షణాలు లేనివారిని మాత్రమే ప్రయాణానికి అనుమతించనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.

అయితే.. మే 7 నుంచి దశల వారీగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి చేర్చనున్నట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments