Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు ఉచిత వైద్యం.. సీఎం ఎంకే స్టాలిన్

Webdunia
ఆదివారం, 19 డిశెంబరు 2021 (09:26 IST)
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రజారంజక నిర్ణయాలు తీసుకుంటూ పాలన సాగిస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు తొలి 48 గంటల పాటు ఉచిత వైద్యం అందించేలా నిర్ణయం తీసుకున్నారు. 
 
ప్రమాదంలో గాయపడినవారికి తొలి 48 గంటలు అత్యంత కీలకం అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. రాష్ట్రం, ప్రాంతంతో నిమిత్తం లేకుండా తమిళనాడు రాష్ట్ర పరిధిలో రోడ్డు ప్రమాదంలో గాయపడే వారందరికీ ఉచిత వైద్యం అందిస్తామని తెలిపారు. ఇందుకోసం "ప్రాణాలను కాపాడుదాం" అనే పథకానికి ఆయన శ్రీకారం చుట్టారు. 
 
ఈ పథకం అమలు కోసం రాష్ట్రంలో 201 ప్రభుత్వ ఆస్పత్రులు, 408 ప్రైవేట్ ఆస్పత్రులను ప్రభుత్వం ఎంపిక చేసింది. క్షతగాత్రులు ఏ ప్రాంతంవారైనా, ఏ దేశం వారైనా, ఏ రాష్ట్రం వారైనా సరే తమిళనాడు రాష్ట్ర పరిధిలో ప్రమాదం జరిగితే ఈ పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు. 
 
ప్రమాదాల్లో గాయపడిన వారికి తొలి 48 గంటలు ఎంతో కీలకం కావడంతోనే తమ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సీఎం స్టాలిన్ తెలిపారు. ఈ పథకాన్ని చెంగల్పట్టు జిల్లా, మేల్‌మరువత్తూరులోని ఆదిపరాశక్తి వైద్య కాలేజీలో శనివారం లాంఛనంగా ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

శివాజీ నటిసున్న సోషియో ఫాంటసీ మూవీ కూర్మనాయకి

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ వచ్చేసింది

చిత్రపురి కాలనీలో అవినీతి కేవలం ఆరోపణ మాత్రమే: సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనీల్‌

నాగ్.. దేవుడు ఇచ్చిన వరం - కొడుకు లేని లోటు తీర్చాడు : అశ్వనీదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments