రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు ఉచిత వైద్యం.. సీఎం ఎంకే స్టాలిన్

Webdunia
ఆదివారం, 19 డిశెంబరు 2021 (09:26 IST)
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రజారంజక నిర్ణయాలు తీసుకుంటూ పాలన సాగిస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు తొలి 48 గంటల పాటు ఉచిత వైద్యం అందించేలా నిర్ణయం తీసుకున్నారు. 
 
ప్రమాదంలో గాయపడినవారికి తొలి 48 గంటలు అత్యంత కీలకం అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. రాష్ట్రం, ప్రాంతంతో నిమిత్తం లేకుండా తమిళనాడు రాష్ట్ర పరిధిలో రోడ్డు ప్రమాదంలో గాయపడే వారందరికీ ఉచిత వైద్యం అందిస్తామని తెలిపారు. ఇందుకోసం "ప్రాణాలను కాపాడుదాం" అనే పథకానికి ఆయన శ్రీకారం చుట్టారు. 
 
ఈ పథకం అమలు కోసం రాష్ట్రంలో 201 ప్రభుత్వ ఆస్పత్రులు, 408 ప్రైవేట్ ఆస్పత్రులను ప్రభుత్వం ఎంపిక చేసింది. క్షతగాత్రులు ఏ ప్రాంతంవారైనా, ఏ దేశం వారైనా, ఏ రాష్ట్రం వారైనా సరే తమిళనాడు రాష్ట్ర పరిధిలో ప్రమాదం జరిగితే ఈ పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు. 
 
ప్రమాదాల్లో గాయపడిన వారికి తొలి 48 గంటలు ఎంతో కీలకం కావడంతోనే తమ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సీఎం స్టాలిన్ తెలిపారు. ఈ పథకాన్ని చెంగల్పట్టు జిల్లా, మేల్‌మరువత్తూరులోని ఆదిపరాశక్తి వైద్య కాలేజీలో శనివారం లాంఛనంగా ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

Rashmika: 2025లో అత్యంత ప్రజాదరణగల తారలు, దర్శకులుగా రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి ప్రకటించిన IMDb

Sholay 4K : సినీపోలిస్ ఇండియా స్వర్ణోత్సవాల కోసం షోలే 4K డిజిటల్‌ పెద్ద తెరపైకి

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments