Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏం కష్టమో... బీజేపీ నేత ఇంట్లో నలుగురి ఆత్మహత్య

Webdunia
సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (10:21 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో దారుణ ఘటన ఒకటి జరిగింది. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మదన్ లాల్ సైనీ కుటుంబానికి చెందిన నలుగురు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం విషాదం నింపింది. ఈ విషాదకర ఘటన రాష్ట్రంలోని సికార్ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఇటీవల తమ కుటుంబ సభ్యుడ్ని కోల్పోయిన బాధతోనే బలవన్మరణానికి పాల్పడినట్టు సమాచారం. మృతులను హనుమాన్ ప్రసాద్ సైనీ, మదన్‌లాల్‌ భార్య తారా, ఇద్దరు కుమార్తెలు అంజు, పూజలుగా గుర్తించారు.  
 
మదన్ లాల్ గత ఏడాది సెప్టెంబరులో పెద్ద కుమారుడిని కోల్పోయారు. దీంతో కుటుంబంలోని వారంతా తీవ్ర మానసిక వ్యధకు లోనయ్యారు. ఈ నేపథ్యంలోనే వీరంతా ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. 
 
మదన్ లాల్‌‌ సోదరుని కుమారుడు హనుమాన్ ప్రసాద్ సైనీ రాసినదిగా భావిస్తున్న సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమ పెద్ద కుమారుడు మృతి చెందిన తర్వాత బతకాలనే ఆశలేదంటూ ప్రసాద్‌ ఈ లేఖలో పేర్కొన్నారు. 
 
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తు జరుగుతోందని పోలీసు అధికారి వీరేంద్ర శర్మ తెలిపారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments