Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏం కష్టమో... బీజేపీ నేత ఇంట్లో నలుగురి ఆత్మహత్య

Webdunia
సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (10:21 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో దారుణ ఘటన ఒకటి జరిగింది. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మదన్ లాల్ సైనీ కుటుంబానికి చెందిన నలుగురు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం విషాదం నింపింది. ఈ విషాదకర ఘటన రాష్ట్రంలోని సికార్ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఇటీవల తమ కుటుంబ సభ్యుడ్ని కోల్పోయిన బాధతోనే బలవన్మరణానికి పాల్పడినట్టు సమాచారం. మృతులను హనుమాన్ ప్రసాద్ సైనీ, మదన్‌లాల్‌ భార్య తారా, ఇద్దరు కుమార్తెలు అంజు, పూజలుగా గుర్తించారు.  
 
మదన్ లాల్ గత ఏడాది సెప్టెంబరులో పెద్ద కుమారుడిని కోల్పోయారు. దీంతో కుటుంబంలోని వారంతా తీవ్ర మానసిక వ్యధకు లోనయ్యారు. ఈ నేపథ్యంలోనే వీరంతా ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. 
 
మదన్ లాల్‌‌ సోదరుని కుమారుడు హనుమాన్ ప్రసాద్ సైనీ రాసినదిగా భావిస్తున్న సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమ పెద్ద కుమారుడు మృతి చెందిన తర్వాత బతకాలనే ఆశలేదంటూ ప్రసాద్‌ ఈ లేఖలో పేర్కొన్నారు. 
 
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తు జరుగుతోందని పోలీసు అధికారి వీరేంద్ర శర్మ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

కోర్ట్‌తో హిట్ కొట్టింది.. ఇప్పుడు కోలీవుడ్‌లో క్రేజేంటో చూపెట్టనున్న శ్రీదేవి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments