Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్యలో మసీదుకి జనవరి 26న శంకుస్థాపన

Webdunia
శనివారం, 19 డిశెంబరు 2020 (09:45 IST)
అయోధ్యలో మసీద్ నిర్మాణానికి పునాది రాయి పడనుంది. గణతంత్ర దినోత్సవం రోజున(జనవరి 26) న శంకుస్థాపన చేయనున్నారు. మసీదు నిర్మాణానికి సంబంధించిన బ్లూ ప్రింట్‌ను ఈ శనివారం రిలీజ్ చేయనున్నారు. 
 
సున్నీ వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేసిన ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ట్రస్ట్ ఈ విషయాన్ని ప్రకటించింది. దశాబ్ధాల తరబడి సాగిన అయోధ్య రామమందిరం, బాబ్రీ మసీద్ వివాదానికి సుప్రీం కోర్టు తీర్పుతో ఎండ్ కార్డు పడడంతో.. మసీదు నిర్మాణానికి సంబంధించిన బ్లూ ప్రింట్‌ను రిలీజ్ చేయనున్నారు. సున్నీ వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేసిన ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ట్రస్ట్ ఈ విషయాన్ని ప్రకటించింది.
 
అయోధ్యలోని దన్నీపూర్‌ గ్రామంలో మసీదు కోసం ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ స్థలంలో మసీదు నిర్మాణాన్ని చేపడుతున్నారు. మసీదు కాంప్లెక్స్‌కు చెందిన బ్లూ ప్రింట్‌లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌, కమ్యూనిటీ కిచెన్‌, లైబ్రరీలు ఉన్నాయి. ఈ ప్లాన్‌కు చీఫ్ ఆర్కిటెక్ట్ ప్రొఫెసర్ ఎస్ఎం అక్తర్ ఆమోదం తెలిపినట్లు ఐఐసీఎఫ్ కార్యదర్శి అథర్ హుస్సేన్ తెలిపారు. 
 
మసీదును రౌండ్ షేప్‌లో నిర్మించనున్నామని.. ఒకేసారి అక్కడ సుమారు రెండు వేల మంది ప్రార్థనలు చేసే విధంగా నిర్మిస్తామన్నారు. కొత్త మసీదు.. బాబ్రీ మసీదు కన్నా పెద్దగా ఉంటుందని..ఆ కాంప్లెక్స్ సెంటర్‌లో హాస్పిటల్‌ను నిర్మిస్తామని, మహామ్మద్ ప్రవక్త బోధించిన విధంగానే మానవ సహాయం చేయనున్నట్లు అకర్త్ తెలిపారు. 300 పడకల సామర్థ్యం గల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించనున్నట్లు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments