Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ కన్నుమూత

Webdunia
గురువారం, 20 మే 2021 (08:55 IST)
కరోనా వైరస్ దెబ్బకు అనేక మంది రాజీకయ ప్రముఖులు కన్నుమూస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా కరోనా వైరస్ సోకి గురువారం కన్నుమూశారు. ఆయన వయసు 89 సంవత్సరాలు. 
 
హర్యానా, బీహార్‌కు గవర్నర్‌గానూ పనిచేసిన పహాడియా 1980-81 మధ్య రాజస్థాన్‌కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. పహాడియా మరణవార్త విని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ దిగ్భ్రాంతికి గురయ్యారు. 
 
పహాడియా కరోనాతో కన్నుమూశారని, ఆయన మరణవార్త తనను షాక్‌కు గురిచేసిందని గెహ్లాట్ ట్వీట్ చేశారు. మొదటి నుంచి ఆయనతో తనకు చక్కని అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. పహాడియా మృతి వ్యక్తిగతంగా తనకు తీరని లోటన్నారు.
 
ఇక ఆయన మృతికి సంతాపంగా రాష్ట్ర ప్రభుత్వం నేడు సంతాపదినంగా ప్రకటించింది. నేడు ప్రభుత్వ కార్యాలయాలను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. జాతీయ పతాకాన్ని అవనతం చేస్తున్నట్టు పేర్కొంది. పహాడియా మృతికి సంతాపం తెలిపేందుకు నేటి మధ్యాహ్నం 12 గంటలకు కేబినెట్ సమావేశం కానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

Tammareddy: ఉమెన్ సెంట్రిక్ గా సాగే ఈ సినిమా బాగుంది : తమ్మారెడ్డి భరద్వాజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments