Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ మంత్రి శైలజా టీచర్‌కు ఓపెన్ సొసైటీ ప్రైజ్...

Webdunia
సోమవారం, 21 జూన్ 2021 (09:24 IST)
కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ మాజీ మంతిర కేకే శైలజకు ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. కరోనా విపత్తు సమయంలో ఆమె చేసిన విశేష సేవలకుగాను సెంట్రల్‌ యూరోపియన్‌ యూనివర్సిటీ (సీఈయూ) ఓపెన్‌ సొసైటీ ప్రైజ్‌-2021 అవార్డు వరించింది. 
 
సీఈయూ 30వ గ్రాడ్యుయేషన్‌ వేడుకల సందర్భంగా శైలజా టీచర్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు సీఈయూ అధ్యక్షుడు మైకేల్‌ ఇగ్నాటీఫ్‌ తెలిపారు. కరోనా సందర్భంగా శైలజతో పాటు వైద్య సిబ్బంది ప్రజలకు విశేష సేవలందించారని ఆయన పేర్కొన్నారు. 
 
అంతేగాక ప్రజాజీవితంలో అడుగుపెట్టాలనుకునే యువతులకు శైలజా టీచర్‌ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా సమాజంలో అసాధారణమైన సేవలకు గుర్తింపుగా ఓపెన్‌ సొసైటీ ప్రైజ్‌ను సీఈయూ ప్రతి ఏటా అందజేస్తూ వస్తోంది. ఇందులో భాగంగా తాజాగా జరిగిన 30వ గ్రాడ్యుయేషన్‌ ప్రదానోత్సవం సందర్భంగా కేకే శైలజ ఈ అవార్డుకు ఎన్నికైనట్లు సీఈయూ ప్రకటించింది. 
 
అయితే.. ఈ పురస్కారం దక్కడంపై కేరళ మాజీ మంత్రి శైలజ ఆనందం వ్యక్తం చేశారు. ఈ పురస్కారాన్ని తీసుకోవడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. కాగా.. ఇటీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్‌ తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే.. కేకే శైలజకు మాత్రం మంత్రివర్గంలో చోటుదక్కలేదు. అయినప్పటికీ ఆమె నిరుత్సాపడలేదు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

నేచురల్ స్టార్ నాని క్లాప్ తో దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం ప్రారంభం

Nag; రజనీ సార్ చెప్పినట్లు ఎప్పుడూ హీరోనేకాదు విలన్ కూడా చేయాలి : నాగార్జున

రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ నుంచి మాళవిక మోహనన్ పోస్టర్ రిలీజ్

మెల్లకన్ను యువకుడు ప్రేమలో పడితే ఎలా వుంటుందనే కాన్సెప్ట్ తో శ్రీ చిదంబరం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments