Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ మంత్రి శైలజా టీచర్‌కు ఓపెన్ సొసైటీ ప్రైజ్...

Webdunia
సోమవారం, 21 జూన్ 2021 (09:24 IST)
కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ మాజీ మంతిర కేకే శైలజకు ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. కరోనా విపత్తు సమయంలో ఆమె చేసిన విశేష సేవలకుగాను సెంట్రల్‌ యూరోపియన్‌ యూనివర్సిటీ (సీఈయూ) ఓపెన్‌ సొసైటీ ప్రైజ్‌-2021 అవార్డు వరించింది. 
 
సీఈయూ 30వ గ్రాడ్యుయేషన్‌ వేడుకల సందర్భంగా శైలజా టీచర్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు సీఈయూ అధ్యక్షుడు మైకేల్‌ ఇగ్నాటీఫ్‌ తెలిపారు. కరోనా సందర్భంగా శైలజతో పాటు వైద్య సిబ్బంది ప్రజలకు విశేష సేవలందించారని ఆయన పేర్కొన్నారు. 
 
అంతేగాక ప్రజాజీవితంలో అడుగుపెట్టాలనుకునే యువతులకు శైలజా టీచర్‌ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా సమాజంలో అసాధారణమైన సేవలకు గుర్తింపుగా ఓపెన్‌ సొసైటీ ప్రైజ్‌ను సీఈయూ ప్రతి ఏటా అందజేస్తూ వస్తోంది. ఇందులో భాగంగా తాజాగా జరిగిన 30వ గ్రాడ్యుయేషన్‌ ప్రదానోత్సవం సందర్భంగా కేకే శైలజ ఈ అవార్డుకు ఎన్నికైనట్లు సీఈయూ ప్రకటించింది. 
 
అయితే.. ఈ పురస్కారం దక్కడంపై కేరళ మాజీ మంత్రి శైలజ ఆనందం వ్యక్తం చేశారు. ఈ పురస్కారాన్ని తీసుకోవడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. కాగా.. ఇటీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్‌ తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే.. కేకే శైలజకు మాత్రం మంత్రివర్గంలో చోటుదక్కలేదు. అయినప్పటికీ ఆమె నిరుత్సాపడలేదు. 

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments