భారత్‌లో అడుగుపెట్టాలనుకుంటే దావూద్ శవమైపోతాడు: ఎమ్ఎన్ సింగ్

ముంబై పేలుళ్ల సూత్రధారి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై ముంబై మాజీ పోలీస్ బాస్ ఎంఎన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దావూద్ ఇబ్రహీం ఇక తన జీవితంలో భారత్‌కు తిరిగి వచ్చే అవకాశాలు లేవని ఎంఎన్ సింగ్ అన్

Webdunia
శుక్రవారం, 27 అక్టోబరు 2017 (13:58 IST)
ముంబై పేలుళ్ల సూత్రధారి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై ముంబై మాజీ పోలీస్ బాస్ ఎంఎన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దావూద్ ఇబ్రహీం ఇక తన జీవితంలో భారత్‌కు తిరిగి వచ్చే అవకాశాలు లేవని ఎంఎన్ సింగ్ అన్నారు. దావూద్ ఇబ్రహీం పేరు చెప్తే ముంబై ప్రజలు భయపడే రోజులు పోయాయని, దావూద్ భారత్‌ వస్తాడనే ఆలోచన కూడా అక్కర్లేదని చెప్పుకొచ్చారు. 
 
ప్రస్తుతానికి దావూద్ పాకిస్థాన్ ఇంటిలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ ఆధీనంలో వున్నాడని ఎంఎన్ సింగ్ చెప్పుకొచ్చారు. దావూద్ భారత్‌కు తిరిగి వచ్చే ఆలోచన చేస్తే.. ఐఎస్ఐ అతడిని హతమార్చడం ఖాయమన్నారు. అందుచేత ఇకపై దావూద్‌ను మర్చిపోండని ఎంఎన్ సింగ్ తెలిపారు. కాగా.. 1993 నాటి పేలుళ్ల ఘటన తర్వాత ఏర్పాటైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ చీఫ్‌గా, నగర పోలీస్ కమిషనర్‌గా, ముంబై క్రైమ్ బ్రాంచ్ సంయుక్త కమిషనర్‌గా ఎమ్ఎన్ సింగ్ బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments