Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.2 వేల రూపాయల నోటు కోసం రైలు పట్టాలపైకి దూకేసింది.. ఏమైందంటే?

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (15:43 IST)
రూ.2 వేల కోసం ఓ మహిళ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మెట్రో పట్టాలపైకి దూకేసింది. ఈ సంఘటన ఢిల్లీలోని ద్వారకామోర్ మెట్రో స్టేషన్ వద్ద మంగళవారం ఉదయం 10:30 గంటల సమయంలో చోటుచేసుకుంది. ఢిల్లీకి చెందిన జకారిచ్ కోశాయ్ అనే మహిళ ద్వారకామోర్ స్టేషన్‌కు చేరుకుంది. ఆమె వద్దనున్న రూ.2 వేల నోటు మెట్రో పట్టాలపై పడిపోయింది. దీంతో ఆ నోటును తీసుకునేందుకు మహిళ పట్టాలపైకి దూకింది. 
 
అంతలోనే పట్టాలపైకి మెట్రో రైలు రావడంతో అక్కడ ఉన్న వారంతా ఆందోళనకు గురయ్యారు. అయితే ఆమె ట్రాక్ మధ్యలో ఉండిపోవడం వల్ల స్వల్ప గాయాలతో బతికి బయటపడింది. కొన్ని బోగీలు ఆమెపై నుంచి వెళ్లాయి. ఆ తర్వాత జకారిచ్‌ను సీఐఎస్ఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మెట్రో సేవలకు అంతరాయం కలిగించినందుకు గానూ క్షమాపణలు కోరుతూ లేఖ రాయించుకున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments