Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూరులో కొత్త సంవత్సర వేడుకలు.. ఓ గ్రూపు నడిరోడ్డుపై ఓ అమ్మాయిని?

కొత్త సంవత్సర వేడుకలు ఐటీ రాజధాని నగరం బెంగళూరులో అట్టహాసంగా జరుగుతాయి. టెక్కీలతో పాటు ప్రజలంతా పండగ చేసుకుంటారు. కానీ అర్థరాత్రి పూట జరిగే కొత్త సంవత్సర ఆహ్వాన వేడుకలు మాత్రం నేరాల సంఖ్యను పెంచేస్తున

Webdunia
మంగళవారం, 16 జనవరి 2018 (15:13 IST)
కొత్త సంవత్సర వేడుకలు ఐటీ రాజధాని నగరం బెంగళూరులో అట్టహాసంగా జరుగుతాయి. టెక్కీలతో పాటు ప్రజలంతా పండగ చేసుకుంటారు. కానీ అర్థరాత్రి పూట జరిగే కొత్త సంవత్సర ఆహ్వాన వేడుకలు మాత్రం నేరాల సంఖ్యను పెంచేస్తున్నాయి. గత ఏడాది బెంగళూరులో ఓ యువతిని నలుగురైదుగురు యువకులు నడిరోడ్డుపై లైంగికంగా వేధించిన సంగతి తెలిసిందే. ఈ వివాదం అప్పట్లో సంచలనం సృష్టించింది. 
 
ఇదే తరహాలో 2018 కొత్త సంవత్సర వేడుకల నాడు రోడ్లపై బెంగుళూరు యువకులు ఓవరాక్షన్ చేశారు. వీధుల్లో వికృతంగా నృత్యాలు చేయ‌డ‌మే కాకుండా అడ్డం వ‌చ్చిన వారిని చిత‌క‌బాది పంపారు. రోడ్ల‌పై అమ్మాయిల‌ను వేధిస్తూ... హింసిస్తూ చాలా సార్లు పోలీసుల‌కు కూడా చిక్కారు. 
 
ఈ క్రమంలో డిసెంబర్ 31 రాత్రి రోడ్ల‌పై అక్క‌డి యువ‌కులు చేసిన పోకిరీ చేష్ట‌లు సీసీ కెమెరా దృశ్యాల ద్వారా ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా మంగళవారం ప‌లువురు యువకులపై కేసులు న‌మోదు చేసిన‌ పోలీసులు ఆ వీడియోను మీడియాకు ఇచ్చారు. 
 
ఈ వీడియోలో కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ఓ గ్రూపు నడి రోడ్డుపై ఎంజాయ్ చేస్తోంది. ఆ దారిలో ఓ బైకుపై ఇద్ద‌రు యువ‌కులు, ఓ అమ్మాయి వెళుతుండ‌గా వారిని ప‌ట్టుకుని చిత‌క్కొట్టారు. ఈ వీడియోలో ఓవరాక్షన్ చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం