Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానంలో రక్తపు వాంతి చేసుకుని ప్రయాణికుడి మృతి

Webdunia
మంగళవారం, 22 ఆగస్టు 2023 (11:52 IST)
విమాన ప్రయాణంలో ఓ ప్రయాణికుడు రక్తపు వాంతి చేసుకుని ప్రాణాలు విడిచాడు. ముంబై నుంచి రాంచీకి వెళుతున్న ఇండిగో విమానంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. దీంతో ఆ విమానాన్ని నాగ్‌పూర్‌లో అత్యవసరంగా కిందకు దించేసి.. బాధితుడిని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆ ప్రయాణికుడు అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. బాధితుడు సీకేడీ, ట్యూబరిక్యులోసిస్‌తో బాధపడుతున్నట్టు సమాచారం.
 
సోమవారం సాయంత్రం ముంబై నుంచి రాంచీకి ఇండిగో విమాన ఒకటి బయలుదేరింది. ఇందులో 62 యేళ్ల ప్రయాణికుడు ఉన్నట్టుండి తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. రక్తపు వాంతి చేసుకున్నాడు. దీంతో పైలెట్ విమానాన్ని నాగ్‌పూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. ఎయిర్ పోర్టు నుంచి బాధితుడిని సమీపంలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. కాగా, మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తరలించారు. ఈ విషయాన్ని కిమ్స్ ఆస్పత్రి బ్రాండింగ్ అండ్ కమ్యూనికేషన్ శాఖ డీజీఎం ఎజాష్ షామీ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments