Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానంలో రక్తపు వాంతి చేసుకుని ప్రయాణికుడి మృతి

Webdunia
మంగళవారం, 22 ఆగస్టు 2023 (11:52 IST)
విమాన ప్రయాణంలో ఓ ప్రయాణికుడు రక్తపు వాంతి చేసుకుని ప్రాణాలు విడిచాడు. ముంబై నుంచి రాంచీకి వెళుతున్న ఇండిగో విమానంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. దీంతో ఆ విమానాన్ని నాగ్‌పూర్‌లో అత్యవసరంగా కిందకు దించేసి.. బాధితుడిని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆ ప్రయాణికుడు అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. బాధితుడు సీకేడీ, ట్యూబరిక్యులోసిస్‌తో బాధపడుతున్నట్టు సమాచారం.
 
సోమవారం సాయంత్రం ముంబై నుంచి రాంచీకి ఇండిగో విమాన ఒకటి బయలుదేరింది. ఇందులో 62 యేళ్ల ప్రయాణికుడు ఉన్నట్టుండి తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. రక్తపు వాంతి చేసుకున్నాడు. దీంతో పైలెట్ విమానాన్ని నాగ్‌పూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. ఎయిర్ పోర్టు నుంచి బాధితుడిని సమీపంలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. కాగా, మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తరలించారు. ఈ విషయాన్ని కిమ్స్ ఆస్పత్రి బ్రాండింగ్ అండ్ కమ్యూనికేషన్ శాఖ డీజీఎం ఎజాష్ షామీ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments