Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్ నుంచి 6 గంటల్లో 3337 మంది వెళ్లిపోయారు : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

ఠాగూర్
గురువారం, 24 ఏప్రియల్ 2025 (16:14 IST)
పహల్గామ్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడి తర్వాత కాశ్మీర్ నుంచి కేవలం 6 గంటల్లో 3300 మంది పర్యాటకులు వెళ్లిపోయారని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖామంత్రి కె.రామ్మోహన్ నాయుడు తెలిపారు. పహల్గామ్‌లోని బైసరన్ లోయలో భీకర ఉగ్రదాడి పర్యాటకులను భయభ్రాంతులకు గురిచేసిందని, దీంతో వందల సంఖ్యలో పర్యాటకులు కాశ్మీర్‌ను వీడుతున్నారని ఆయన పేర్కొన్నారు. 
 
"ఉగ్రదాడి నేపథ్యంలో శ్రీనగర్ నుంచి పర్యాటకుల సురక్షిత ప్రయాణం కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. బుధవారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీనగర్ విమానాశ్రయం నుంచి 20 విమానాలు వెళ్లాయి. 3337 మంది ప్రర్యాటకులు ఈ ప్రాంతాన్ని వీడారు. ప్రయాణికుల సౌకర్యం కోసం అదనపు విమాన సర్వీసులను కూడా అందుబాటులో ఉంచాం" అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తన పోస్టులో రాసుకొచ్చారు. 
 
మరోవైపు, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కాశ్మీర్‌లో పర్యటించేందుకు రద్దయ్యాయని ఢిల్లీలోని పలు పర్యాటక రవాణా సంస్థలు బుధవారం వెల్లడించాయి. ఉగ్రదాడి తర్వాత పర్యాటకులు కాశ్మీర్‌లో ఉండేందుకు, పర్యటించేందుకు సహాసం చేయడం లేదని టూరిస్ట్ ఏజెన్సీలు పేర్కొంటున్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

పాకిస్థాన్ నటుడు నటించిన "అబీర్ గులాల్‌"పై కేంద్రం నిషేధం!

Rowdy Wear : రౌడీ వేర్ ఆఫ్ లైన్ స్టోర్ కోసం డిమాండ్ ఉంది : విజయ్ దేవరకొండ

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments