జంట హత్య కేసులో టూటూల ఆధారంగా నిందితుల గుర్తింపు!!

Webdunia
శుక్రవారం, 20 అక్టోబరు 2023 (14:48 IST)
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఇద్దరు యువతుల హత్య కేసులోని నిందితులను పోలీసులు గుర్తించారు. ఓ యువకుడి చేతిపై ఉన్న టాటూ, మరో నిందితుడి చేతిలో ఉన్న పోలీసుల వైర్‌లెస్ సెట్, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. ఢిల్లీ పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. 
 
గత 2009 మార్చి 18న నగరంలో ఐటీ నిపుణురాలు జిగీశ ఘోష్ అనే యువతి హత్య జరిగింది. రెండు మూడు రోజుల తర్వాత ఫరీదాబాద్‌లోని సూరజ్ కుంద్ ప్రాంతంలో ఈమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుండగులు ఆమెను దోచుకొని హత్య చేశారు. జిగీశ డెబిట్ కార్డు ఉపయోగించి నిందితులు షాపింగ్ కూడా చేశారు. 
 
ఈ సీసీటీవీ ఫుటేజి పరిశీలించిన విచారణ అధికారులు వారిలో ఒకరి చేతికి టాటూ (పచ్చబొట్టు), మరొకరి చేతిలో పోలీసుల వైర్లెస్ సెట్టు, తలపై టోపీ ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత ఢిల్లీ పోలీసుల హ్యూమన్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్ సాయంతో మరింత నిశిత పరిశీలన చేశారు. ఆ తర్వాత నిందితులు బల్జీతామాలిక్, రవికపూర్, అమిత శుక్లాలను అరెస్టు చేశారు. వీరిలో మాలిక్ చేతిపై అతడి పేరుతో టాటూ ఉండగా, రవికపూర్ వద్ద గతంలో పోలీసు అధికారి నుంచి లాక్కొన్న వైర్‌లెస్ సెట్టు ఉంది. 
 
వసంత్ విహార్‌లోని జిగీశ ఇంటి సమీపం నుంచి ఆమెను అపహరించి, ఆమె వద్ద ఉన్న వస్తువులు దోచుకున్నాక చంపి పడేసినట్లు నిందితులు ముగ్గురూ అంగీకరించారు. ఈ సందర్భంగా రవికపూర్ చెప్పిన మరో విషయం విని పోలీసులు విస్తుపోయారు. నెల్సన్ మండేలా మార్గ్‌లో మరో యువతిని తాము హత్య చేశామని, ఇందులో అజయ్ కుమార్, అజయ్ సేథి అనే మరో ఇద్దరి హస్తం కూడా ఉన్నట్లు వెల్లడించాడు. దీంతో 2008 సెప్టెంబరు 30న జరిగిన టీవీ జర్నలిస్టు సౌమ్యా విశ్వనాథన్ హత్యకేసు గుట్టు కూడా రట్టయింది. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments