Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుంభకోణం భయంతో ఫైళ్ళపై సంతకాలు పెట్టడం లేదు : మనోహర్ పారికర్

Webdunia
శుక్రవారం, 22 మే 2015 (12:29 IST)
దేశ రక్షణ శాఖామంత్రి మనోహర్ పారికర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఫైళ్ళపై సంతకాలు పెట్టేందుకు భయపడుతున్నట్టు చెప్పారు. దీనికి కారణం కుంభకోణాల భయమేనన్నారు. ఫైళ్ళపై సంతకాలు పెట్టక పోవడానికి కుంభకోణాల భయమే కారణమని, మరో ఉద్దేశ్యం లేదని ఆయన వివరించారు.
 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం 365 రోజుల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా రక్షణ మంత్రి మనోహర్ పారికర్ మీడియాతో మాట్లాడుతూ... గత ప్రభుత్వాలు జరిపిన కుంభకోణాలు తిరిగి ఎక్కడ పునరావృతమవుతాయో అన్న భయాందోళనలు నిర్ణయాల ఆలస్యానికి దారితీస్తున్నాయన్నారు. 
 
"ఏ ఫైలూ కదలలేని స్థితిలో ఉంది. ప్రతి నిర్ణయం వెనుక ప్రతిఫలాలు అందుకోవడం లేదా కుంభకోణం ఉంటుందన్న అభిప్రాయంలో ప్రజలున్నారు. నేను రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత 200కు పైగా సిఫార్సు నోట్లు వివిధ లాబీల నుంచి అందుకున్నా" అని ఆయన వివరించారు. పచ్చజెండా ఊపేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నట్టు మంత్రి చెప్పారు. 

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments