Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైన్‌షాపుకు ఐదేళ్ల కుమారుడితో వెళ్లిన తండ్రి..

Webdunia
శుక్రవారం, 4 జనవరి 2019 (11:53 IST)
అవును.. మందేసేందుకు ఐదేళ్ల కుమారుడిని వెంటబెట్టుకుని వెళ్లాడు ఓ తండ్రి. అయితే ఫూటుగా తాగేసిన ఆ దుర్మార్గుడు కన్నబిడ్డను మరిచిపోయాడు. తాగి రోడ్డుపైనే పడిపోయాడు. చివరికి ఆ బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఈ ఘటన చెన్నైకి సమీపంలోని ఓరగడంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కాంచీపురం జిల్లా, ఓరగడం సమీపంలోని సేందమంగళం ప్రాంతానికి చెందిన కుమార ప్రసాద్ తన ఐదేళ్ల కుమారుడితో టాస్క్ మార్క్ షాపుకు వెళ్లాడు. ఐదేళ్ల కుమారుడిని పక్కనే కూర్చోబెట్టుకుని.. మద్యం తాగాడు. ఫుల్‌గా తాగడంతో తలతిరిగి రోడ్డుపై పడ్డాడు. చివరికి కుమారప్రసాద్ ఐదేళ్ల కుమారుడిని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. 
 
ఇంతలో కుమార ప్రసాద్‌ని వెతుక్కుంటూ ఆతడి భార్య రోడ్డుపైకి వచ్చింది. కానీ భర్త రోడ్డుపై పడివుండటాన్ని గమనించింది. ఇంకా పిల్లాడు కిడ్నాప్ అయ్యాడని తెలుసుకుని బోరున విలపిస్తూ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments