Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైన్‌షాపుకు ఐదేళ్ల కుమారుడితో వెళ్లిన తండ్రి..

Webdunia
శుక్రవారం, 4 జనవరి 2019 (11:53 IST)
అవును.. మందేసేందుకు ఐదేళ్ల కుమారుడిని వెంటబెట్టుకుని వెళ్లాడు ఓ తండ్రి. అయితే ఫూటుగా తాగేసిన ఆ దుర్మార్గుడు కన్నబిడ్డను మరిచిపోయాడు. తాగి రోడ్డుపైనే పడిపోయాడు. చివరికి ఆ బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఈ ఘటన చెన్నైకి సమీపంలోని ఓరగడంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కాంచీపురం జిల్లా, ఓరగడం సమీపంలోని సేందమంగళం ప్రాంతానికి చెందిన కుమార ప్రసాద్ తన ఐదేళ్ల కుమారుడితో టాస్క్ మార్క్ షాపుకు వెళ్లాడు. ఐదేళ్ల కుమారుడిని పక్కనే కూర్చోబెట్టుకుని.. మద్యం తాగాడు. ఫుల్‌గా తాగడంతో తలతిరిగి రోడ్డుపై పడ్డాడు. చివరికి కుమారప్రసాద్ ఐదేళ్ల కుమారుడిని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. 
 
ఇంతలో కుమార ప్రసాద్‌ని వెతుక్కుంటూ ఆతడి భార్య రోడ్డుపైకి వచ్చింది. కానీ భర్త రోడ్డుపై పడివుండటాన్ని గమనించింది. ఇంకా పిల్లాడు కిడ్నాప్ అయ్యాడని తెలుసుకుని బోరున విలపిస్తూ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments