Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భంతో వున్న కూతురు.. పొట్టపై కత్తితో పొడిచి చంపేసిన తండ్రి.. ఎక్కడ?

Webdunia
గురువారం, 18 జులై 2019 (11:36 IST)
మహారాష్ట్రలో పరువు హత్య చోటుచేసుకుంది. ప్రేమించి వివాహం చేసుకుని గర్భంతో వున్న సమయంలో తల్లిదండ్రుల వద్దకు వచ్చిన ఓ యువతి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఆమె పట్ల తండ్రే యముడై కూర్చున్నాడు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర, గట్కోబర్ ప్రాంతంలో నివసిస్తున్న రాజ్ కుమార్ కుమార్తె మీనాక్షి (20). ఈమె అదే ప్రాంతానికి చెందిన బ్రిజేష్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. 
 
ఈ విషయం తండ్రికి తెలియడంతో.. వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుందని.. పరువు పోతుందని భావించాడు. వీరి వివాహానికి అడ్డుచెప్పాడు. కానీ ప్రేమించి వివాహం చేసుకున్న మీనాక్షి గర్భంతో వున్నానని చెప్పేందుకు స్వగ్రామానికి వచ్చింది. 
 
అలా వచ్చిన కూతురిని ఇంటికి తీసుకుపోని ఆమె తండ్రి రాజ్ కుమార్ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ కూతురు కడుపుతో వుందనే కనికరం లేకుండా కత్తితో పొట్టపై పొడిచి ఘోరంగా హత్య చేశాడు. 
 
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. మీనాక్షి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టు మార్టంకు పంపారు. రాజ్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments