Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొడుకు ప్రేమ వివాహం... కోడలి తాళిబొట్టు తెంచి, కాల్చేసిన తండ్రి..!

Webdunia
గురువారం, 5 మార్చి 2015 (16:46 IST)
తరాలు మారినా, ప్రేమపై తండ్రుల అభిప్రాయాలు, అపోహలు మాత్రం మారలేదు. తాజాగా ఓ తండ్రి తన కుమారుడు ప్రేమించి వివాహం చేసుకున్నాడనే కోపంతో, కోడలి మెడలో ధరించి ఉన్న తాళిబొట్టు తెంచి, కాల్చేశాడు. ఈ సంఘటన తమిళనాడులోని కలకలం రేపుతోంది.
 
ఈ దారుణ సంఘటన సేలం జిల్లా ఓమలూరు సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పన్నపట్టికి చెందిన వ్యక్తి పళణిస్వామి కుమారుడు గోవింద (22) సేలంలో వున్న ఒక జౌళి దుకాణంలో పని చేస్తున్నాడు. అదే దుకాణంలో పని చేస్తున్న దివ్య (19)ని గోవింద రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఈ స్థితిలో గత నెల 23వ తేదీ సేలం ఊత్తుమలై మురుగన్ ఆలయంలో గోవింద, దివ్య వివాహం చేసుకున్నారు.
 
తరువాత ప్రేమికులు ఇద్దరూ తమ తమ ఇళ్లకు వెళ్లారు. ఈ సంగతి తెలుసుకున్న గోవింద తండ్రి పళణిస్వామి తన కుమారుడిని ఇంటిలోనే బంధించి పనికి మాన్పించాడు. దీంతో స్నేహితుల సహాయంతో బయటపడిన గోవింద వివాహం చట్టబద్ధం కావడానికి ఓమలూరులో రిజిష్టర్ వివాహం చేసుకోవడానికి దివ్యను తీసుకుని రిజిష్టర్ కార్యాలయానికి వెళ్లారు. ఈ సంగతి తెలుసుకున్న పళణిస్వామి ప్రేమికులను వెంటాడి వారిపై దాడి చేసి దివ్య మెడలో వున్న తాళి బొట్టు తెంచి దగ్ధం చేశాడు.
 
తరువాత పళణిస్వామి నుంచి తప్పించుకున్న ప్రేమ జంట ఓ దుకాణంలో పసుపుతాడును తీసుకుని పసుపుకొమ్ము ఉన్న తాళి బొట్టును గోవింద దివ్య మెడలో కట్టాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ప్రేమజంటకు ఆశ్రయమిచ్చి రిజిష్టర్ వివాహం చేయించారు.

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments