Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాపై అత్యాచారం జరిగిందని నాన్నకు చెప్పా.. కుప్పకూలిపోయాడు.. గుండె ఆగిపోయింది..

ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. 15 ఏళ్ల బాలికపై ఓ పోలీసు అత్యాచారానికి పాల్పడ్డాడు. కన్నబిడ్డ అత్యాచారానికి గురైందన్న వార్త విని బాధితురాలి తండ్రి గుండె ఆగిపోయింది. ఈ ఘటన ఉత్త

Webdunia
మంగళవారం, 22 ఆగస్టు 2017 (11:52 IST)
ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. 15 ఏళ్ల బాలికపై ఓ పోలీసు అత్యాచారానికి పాల్పడ్డాడు. కన్నబిడ్డ అత్యాచారానికి గురైందన్న వార్త విని బాధితురాలి తండ్రి గుండె ఆగిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ బల్లియా జిల్లాలోని పోలీస్‌ అవుట్‌ పోస్టు సమీపంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే..  బాలిక రాత్రిపూట టాయిలెట్ కోసం ఇంటి నుంచి బయటకి వెళ్లింది. బాలిక బయటికి రావడాన్ని చూసిన గోపాల్‌పుర్‌ అవుట్‌ పోస్ట్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ధరమ్ ‌‌(38)  బాలికను లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కేకలు పెట్టడంతో స్థానికులు ఆమెను కాపాడారు. గ్రామస్థుల్ని చూసిన కానిస్టేబుల్ పారిపోయాడు. 
 
పోలీసులకు బాధితురాలి కుటుంబీకులు ఫిర్యాదు చేయడంతో కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ఘటనపై బాధితురాలు మాట్లాడుతూ.. తనపై అత్యాచారం జరిగిందంటూ నాన్నతో ఏడుస్తూ చెప్పేసరికి.. ఆయన కుప్పకూలిపోయాడని.. అపస్మారక స్థితికి చేరుకున్నాడని చెప్పింది. ఆస్పత్రికి తరలించినా.. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారని వెల్లడించింది.

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments