Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేవైసీ అప్‌‍డేట్ చేయకుంటే డీయాక్టివేట్ : ఎన్.హెచ్.ఏ.ఐ

వరుణ్
సోమవారం, 15 జనవరి 2024 (20:06 IST)
ఫాస్టాగ్ విషయమై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. నో యువర్ కస్టమర్ (కేవైసీ)ని పూర్తి చేయని ఫాస్టాగ్‌లును పూర్తిగా బ్లాక్ చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 31వ తేదీలోగా కేవైసీ అప్‌‍డేట్ చేయని ఫాస్టాగ్‌ను డీయాక్టివేట్ లేదా బ్లాక్ చేయనున్నట్టు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. 
 
కేవైసీ పూర్తి చేయకుంటే ఫాస్టాగ్ బ్యాలెన్స్ ఉన్నా వాటిని బ్యాంకులు డీయాక్టివేట్ లేదా బ్లాక్ చేస్తాయని, ఈ అసౌకర్యాన్ని నివారించుకోవాలంటే యూజర్లు వెంటనే కేవైసీ పూర్తి చేసుకోవాలని ఎన్.హెచ్.ఏ.ఐ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం సమీపంలోని టోల్ ప్లాజా లేదా సంబంధిత బ్యాంకు కస్టమర్ కేర్ నెంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చునని సూచించింది. 
 
వాహనదారులు కొన్నిసార్లు ఫాస్టాగ్‌లను వాహనం ముందు పెట్టకుండా ఇష్టానుసారంగా పెడుతున్నారని... దాంతో టోల్ ప్లాజాలలో ఆలస్యం కావడంతో పాటు అందరినీ అసౌకర్యానికి గురిచేస్తోందని పేర్కొంది. వాహనదారులు ఒకే ఫాస్టాగ్‌ను అనేక వాహనాలకు... ఒకే వాహనానికి పలు ఫాస్టాగ్‌లను లింక్ చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని... ఇలాంటి వాటిని ప్రోత్సహించవద్దని సూచించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments