Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసు కాల్పుల్లో రైతు మృతి... ఛలో ఢిల్లీకు రెండు రోజుల విరామం

వరుణ్
గురువారం, 22 ఫిబ్రవరి 2024 (10:18 IST)
కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్న ప్రధాన డిమాండ‌తో పాటు ఇతర సమస్యల పరిష్కారం కోసం రైతులు చేపట్టిన ఛలో ఢిల్లీ ఆందోళనకరంగా మారింది. బుధవారం రైతులు, పోలీసులకు మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. దీంతో పోలీసుల జరిపిన కాల్పుల్లో ఒక రైతు ప్రాణాలు కోల్పోగా, మరో రైతు గాయపడ్డారు. గాయపడిన రైతు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు రైతు సంఘాల నేతలు తెలిపారు. ఇదిలావుంటే, ఛలో ఢిల్లీ కార్యక్రమం పంజాబ్ - హర్యానా రాష్ట్రాల సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. రైతులకు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఈ ఆందోళనకు రెండు రోజుల పాటు తాత్కాలిక విరామం ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని రైతు సంఘాల నేతలు ప్రకటించారు. 
 
ఇదే అంశంపై పంజాబ్ కిసాన్ మజ్ఞూర్ సంఘర్ష్ కమిటీ నాయకుడు సర్వన్ సింగ్ పందేర్ బుధవారం హర్యానా పోలీసుల మధ్య జరిగిన ఘర్షణపై మీడియాతో మాట్లాడారు. ఖనౌరీ - శంభు సరిహద్దుల్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై హర్యానా పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారని, దీనిని ఖండిస్తున్నామన్నారు. చాలా మంది రైతులు గాయపడ్డారని, చాలా మంది కనిపించడం లేదని పందేర్ పేర్కొన్నారు. ఈ పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని రాబోయే రెండు రోజుల పాటు 'ఛలో ఢిల్లీ' మారున్ను నిలిపివేయాలని నిర్ణయించుకున్నామని, ఈ రెండు రోజుల విరామంలో గాయపడిన, కనిపించకుండా పోయిన రైతుల కుటుంబాలను కలుస్తామని వెల్లడించారు. 
 
పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత హామీ విషయంలో ప్రభుత్వం పారిపోతోందన్నారు. రైతులు రహదారిని దిగ్బంధించలేదని, ప్రభుత్వమే ఆ పని చేసిందని ఆయన అన్నారు. శాంతియుతంగా ముందుకు వెళ్తామని చెబుతూనే ఉన్నామని పేర్కొన్నారు. కాగా రైతులు - హర్యానా పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో ఒక యువ రైతు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ మరో ఇద్దరు రైతుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పాటియాలాలోని రజింద్ర హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ రేఖీ వెల్లడించారు. 
 
అలాగే, ఈ ఘర్షణలపై హర్యానా పోలీసు అధికారి మనీషా చౌదరి స్పందించారు. దాటా సింగ్ - ఖానౌరీ సరిహద్దులో రైతు నిరసనకారులు పోలీసు సిబ్బందిని చుట్టుముట్టారని తెలిపారు. పోలీసులను అడ్డుకునేందుకు పంట వ్యర్థాలను తగలబెట్టి మంటల్లో కారం పోశారని, పోలీసులపైకి రాళ్లు రువ్వారని తెలిపారు. కర్రలతో పోలీసులపై దాడి చేశారని, ఈ ఘటనలో 12 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారని వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments